Coal Mine: చైనాలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ 82 మంది కార్మికులు మరణించారు. మరియ ఇంకో తొమ్మిది మంది ఆచూకీ కోసం అక్కడ రెస్యూ టీం ప్రయత్నిస్తుందని సచాచారం. ఈ సంఘటనతో అక్కడి ప్రాంతమంతా ఆదోళనకు గురయ్యింది. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది. రాత్రి 7:29 గంటలకు ఇది జరిగింది.
Also Read: జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!
రాత్రి బొగ్గు గన్నుల్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి నట్టు అక్కడి మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదం సమయంలో కనీసం అక్కడ 247 మంది కార్మికులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పందించారు. బోగ్గు గనుల్లో ప్రామాదానికి గురైన కార్మికులకు అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులకు జిన్ పింగ్ ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు అండగా నిలవాలని తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలుసు కోవాలని తెలిపారు. ఈ సంఘనకు కారనమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
Also read: సరికొత్త హంగులతో గోల్డెన్ చారియట్.. సౌత్ ఇండియన్ టూర్ కు మీరు రెడీనా?