E-Paper
Advertisement

International: ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో భారతీయులు క్షేమం

International: ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో భారతీయులు క్షేమం

Oil tanker capsizes in Oman 8 Indians among 9 rescued
ఒమన్ సముద్ర ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే భారత్ నావికా దళానికి చెందిన రెస్క్యూ టీమ్ రంగంలో దిగింది. సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. మునిగిన ఆయిల్ ట్యాంకర్ కింద చిక్కుకున్న 16 మందిలో 9 మంది సిబ్బందిని భారత నావికా దళం కాపాడింది. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రక్షించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది భారతీయులు, ఓ శ్రీలంక జాతీయుడు ఉన్నారు. మునిగిపోయిన మరికొందరు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఒమన్ అధికారుల అనుమతి

ఒమన్ సముద్ర తీరంలో కొమెరోస్ జెండాతో 16 మంది సిబ్భందితో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన దుర్ఘటనలో 16 మంది మృతి చెందిన విషయాన్ని ధృవీకరిస్తూ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటన జారీ చేసిన విషయం విదితమే. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులను రక్షించే విషయంలో ఒమన్ అధికారులతో భారత నావికా దళ అధికారులు చర్చలు జరిపి వారి అనుమతితోనే రెస్క్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×