E-Paper
Advertisement

Jagtial District: మా నాన్నను చంపేశారు.. భూమి లాక్కున్నారు, ప్రజావాణిలో చిన్నారుల ఆవేదన

Jagtial District: మా నాన్నను చంపేశారు.. భూమి లాక్కున్నారు, ప్రజావాణిలో చిన్నారుల ఆవేదన
Advertisement

Jagtial District: ఇటీవల కాలంలో దేశంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్తి కోసం సొంత అన్నదమ్ములను, అక్కాచెల్లెళను సైతం చంపడానికి వెనుకాడడం లేదు. నిత్యం దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు, పోలీస్ అధికారులు ఎన్ని కఠిన చర్యలు విధించినా కొందరి తీరు మాత్రం మారడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ తండ్రిని ఆస్తి వివాదాల కారణంగా తన తాత, బాబాయ్ కలిసి చంపేశారని వారి భూమి, ఇల్లు లాక్కున్నారంటూ ఇద్దరు చిన్నారులు కలెక్టర్ కు వినతి ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ జగిత్యాల జిల్లాలో ప్రజావాణికి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ప్రజావాణికి వచ్చింది. ప్రజావాణిలో తమ తండ్రిని భూ వివాదాలతో తాత, బాబాయ్‌ కలిసి చంపేశారని… వారి భూమి, ఇల్లు లాక్కున్నారంటూ కలెక్టర్‌కు వినతి అందజేశారు. జగిత్యాల జిల్లా మోహన్‌రావు పేట గ్రామానికి చెందిన లాస్య, తన ఇద్దరు పిల్లలతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారులు ఇద్దరు తమ తండ్రిని చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ: Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. భర్తను తలచుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన మాగంటి సునీత

తమ తండ్రి పేరు మీద ఉన్న 5ఎకరాల భూమిని,ఇంటిని లాక్కొని… గెంటేశారని వాపోయారు. పంట పొలంపై కోర్టులో కేసు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమ భూమి కావాలని అడిగితే చంపేస్తామంటూ.. దాడి చేశారన్నారు. చిన్నారులు ఎలాగైనా తమకు న్యాయం చేయాలంటూ ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తనకు ఏదైనా ఉపాధి కల్పిస్తే, రుణపడి ఉంటానని… జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించి, కన్నీటి పర్యంతమయ్యారు చిన్నారుల తల్లి కోట లాస్య.

Advertisement

ALSO READ: ESIC Posts: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే ఉద్యోగం నీదే బాస్, డోంట్ మిస్

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×