E-Paper
Advertisement

Qatar Death Sentence | నేవి అధికారులకు ఉరిశిక్ష తీర్పుపై ఖతర్ కోర్టులో అప్పీలు చేసిన భారత్

Qatar Death Sentence | భారతదేశ మాజీ నేవీ అధికారులకు ఖతర్ దేశ కోర్టు అక్టోబర్ 26న ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో భారత ప్రభుత్వం ఖతర్ కోర్టులో ఉరిశిక్ష తీర్పపై గురువారం అప్పీలు చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష కేసులో భారత ప్రభుత్వం ఖతర్ కోర్టులో అప్పీలు చేసిందని తెలిపారు.

Qatar Death Sentence | నేవి అధికారులకు ఉరిశిక్ష తీర్పుపై ఖతర్ కోర్టులో అప్పీలు చేసిన భారత్
Advertisement

Qatar Death Sentence | భారతదేశ మాజీ నేవీ అధికారులకు ఖతర్ దేశ కోర్టు అక్టోబర్ 26న ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో భారత ప్రభుత్వం ఖతర్ కోర్టులో ఉరిశిక్ష తీర్పపై గురువారం అప్పీలు చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష కేసులో భారత ప్రభుత్వం ఖతర్ కోర్టులో అప్పీలు చేసిందని తెలిపారు.

ఖతర దేశ న్యాయశాఖ అధికారులతో ఈ కేసు విషయంలో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. ఖతర్ దేశ మిలిటరీ రహస్యాలతో ముడిపడి ఉన్న కేసు గనుక ఖతర్ కోర్టు మరిన్ని వివరాలు వెల్లడించకూడదని ఆదేశించిందని అన్నారు. ఈ కేసు వివరాలు కేవలం ఖతర్ న్యాయశాఖ అధికారులతో మాత్రమే చర్చించాలని కోర్టు కఠిన నిబంధనలు విధించిందని పేర్కొన్నారు.

Advertisement

భారత మాజీ నేవీ అధికారులు 8 మందిని గత సంవత్సరం ఆగస్టులో ఖతర్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి వారిపై ఖతర్ కోర్టులో విచారణ సాగుతోంది. ఎన్నోసార్టు బెయిలు కోరినా కోర్టు తిరస్కరించింది. ఈ 8 మంది అధికారులు ‘అల్ దెహరా’ అనే నేవీ ఉపకారణాలు తయారు చేసే సంస్థలో ఉన్నత పదువులలో పనిచేస్తున్నారు. అయితే ఆ సంస్థ ద్వారా వీరంతా ఖతర్ మిలిటరీ రహస్యాలు దొంగిలిస్తున్నారని ఆరోపణలున్నాయి. పూర్తి వివరాలు వెల్లడించకపోయినా.. ఈ అధికారులంతా ఇజ్రాయెల్ కోసం గూఢాచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సమాచారం.

మరోవైపు ఈ 8 మంది భారత అధికారులను వెంటనే విడిపించాలని వారి కుటుంబాలు మోదీ ప్రభుత్వానికి ఎన్నో సార్లు వేడుకున్నాయి. భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. ఖతర్ జైలులో ఖైదీలుగా ఉన్న అధికారుల కుటుంబాలను పరామర్శించారు. వారందరినీ విడిపించడానికి న్యాయపరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×