E-Paper
Advertisement

Dell: నష్టాల్లో డెల్.. 6వేల మందికి ఉద్వాసన

Dell: నష్టాల్లో డెల్.. 6వేల మందికి ఉద్వాసన

Dell: కరోనా సంక్షోభంలో అన్ని రంగాలు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ఒక్క ఐటీ రంగం మాత్రం తట్టుకొని నిలబడింది. అలాంటిది ఇప్పుడు మాంద్యం దెబ్బకు విలవిలలాడుతోంది. ఆర్థిక నష్టాలతో దిగ్గజ కంపెనీలు సైతం దివాలా తీస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. ఇప్పుడు పీసీ తయారీ సంస్థ డెల్ టెక్నాలజీ వంతు వచ్చింది.

మొత్తం 6,650 మంది ఉద్యోగులను సాగనంపుతున్నట్లు డెల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఇది తమ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానమని తెలిపింది. ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.

కరోనా కాలంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోం చేయడం.. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌లు వినడంతో పీసీలకు డిమాండ్ పెరిగింది. దీంతో జోరుగా పీసీల విక్రయాలు జరిగాయి. అయితే ప్రస్తుతం కరోనా తగ్గి పరిస్థితులు మెరుగుపడడంతో పీసీల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. దీంతో పీసీ తయారీ కంపెనీలకు నష్టాలు తప్పడం లేదు.

డెల్ టెక్నాలజీస్‌కు మొత్తం ఆదాయంలో 55 శాతం పీసీల నుంచే వస్తోంది. ప్రస్తుతం డెల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన దాదాపు 37 శాతం పడిపోయాయి. దీంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×