E-Paper
Advertisement

Sunita Williams: 2025 ఫిబ్రవరిలోనే భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎందుకో తెలుసా ?

Sunita Williams: 2025 ఫిబ్రవరిలోనే భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎందుకో తెలుసా ?
Advertisement

Sunita Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ లివ్మోర్ స్పేస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సాంకేతిక లోపం కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుని పోయారు. ఈ ఇద్దరు వ్యోమగాములు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ ప్రకటన విడుదల చేసింది.

బోయింగ్ స్టార్ లైనర్‌లో వెళ్లిన ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకువచ్చేందుకు పరిశీలిస్తున్నామని నాసా తెలిపింది. సునీతా విలియమ్స్, విల్మోర్‌ను స్టార్ లైనర్ జూన్ 5 వ తేదీన ఇంటర్ నేషనల్ ఐఎస్ఎస్‌కు తీసుకు వెళ్లింది. వీరు ఎనిమిది రోజుల మిషన్‌ను పూర్తి చేసుకుని మళ్లీ భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. కానీ..హీలియం లీక్‌తో పాట్ మరి కొన్ని కారణాల వల్ల వ్యోమగాములు భూమికి తిరిగి రావడం లేదు.

Advertisement

బోయింగ్ సంస్థకు ఇదే తొలి మిషన్. సునీత సునీతా విలియమ్స్ విల్మోర్ రెండు నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరూ 2025 ఫిబ్రవరిలో మాత్రమే భూమిపైకి తిరిగి వచ్చే అవకాశముందని నాసా వెల్లడించింది. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ మాట్లాడుతూ వారిని తిరిగి రావడం తమకు మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఎలాన్ మస్క్ కంపెనీతో నాసా పనిచేస్తుందని వెల్లడించారు. వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని అన్నారు.

Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్, వేటాడి ఊచకోత

Advertisement

స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ సహాయంతో తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. స్పెస్ మిషన్‌లో ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ పంపేందుకు అవకాశం ఉంది. ఈ ప్రయోగం సెప్టెంబర్‌లో ఉండవచ్చు. దీనితోనే సునీతా విలియమ్స్ భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తోంది. స్టార్ లైన్ లోనే తీసుకు రావాలా లేకపోతే క్రూ డ్రాగన్ ఉపయోగించాలా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×