E-Paper
Advertisement

భారత్‌ నరకం వ్యాఖ్యలపై ట్రంప్ యూ-టర్న్.. తిట్టినా మనోడే.. పొగిడినా మనోడే

భారత్‌ నరకం వ్యాఖ్యలపై ట్రంప్ యూ-టర్న్.. తిట్టినా మనోడే.. పొగిడినా మనోడే
Advertisement

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను నరకం (Hellhole) అని సంబోధించారన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం ఈ అంశంపై వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తూ.. భారత్ పట్ల ట్రంప్‌కు ఉన్న అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. ఆయన దృష్టిలో భారత్ ఒక గొప్ప దేశమని, తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడు భారత్‌ను నడిపిస్తున్నారని ఎంబసీ పేర్కొంది.

అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ నిర్వహించిన ఒక టాక్ షో ట్రాన్స్‌క్రిప్ట్‌ను డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా రీపోస్ట్ చేయడంతో ఈ వివాదం మొద‌లైంది. ఆ లేఖలో సావేజ్.. భారత్, చైనా, ఇతర దేశాలను భూమిపై ఉన్న నరకాలుగా అభివర్ణించారు. అమెరికాలో అమల్లో ఉన్న ‘బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్’ (జన్మతః వచ్చే పౌరసత్వం) చట్టాన్ని ఆసరాగా చేసుకుని, పౌరసత్వం పొందడం కోసం తొమ్మిదో నెలలో గర్భిణులు ఈ దేశాల నుండి అమెరికాకు వస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పోస్ట్ ప్రధానంగా అమెరికన్ సివిల్ లిబరీస్ యూనియన్ (ACLU) లక్ష్యంగా సాగింది. ఇది అమెరికన్ పౌరుల కంటే అక్రమ వలసదారులకే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement

ట్రంప్ ఈ వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేయడంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆచితూచి స్పందించిన కొద్దిసేపటికే అమెరికా ఎంబసీ స్పందించింది. “అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను ఒక గొప్ప దేశంగా పరిగణిస్తారు. అక్కడ తనకు అత్యంత ఆప్తమిత్రుడు (ప్రధాని మోదీని ఉద్దేశించి) అధికారంలో ఉన్నారని ఆయన స్వయంగా చెప్పారు” అని ఎంబసీ ప్రతినిధి వెల్లడించారు.మైఖేల్ సావేజ్ పాడ్‌కాస్ట్ వీడియోను ట్రంప్, షేర్ చేయడం వల్ల అది ఆయన అభిప్రాయమేనన్న సంకేతాలు వెళ్లాయని ఎంబ‌సీ స్ప‌త‌నిచ్చింది. సావేజ్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వ్యక్తిగత అభిప్రాయాలు కాదని, అది కేవలం ఒక చర్చా కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం మాత్రమేనని పరోక్షంగా స్పష్టం చేశారు.

Read Also: భారత్‌ను నరకంతో పోల్చిన ట్రంప్‌.. స్పందించిన భారత్‌

Related News

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Big Stories

Advertisement
×