E-Paper
Advertisement

Tsunami Warning : సాల్మన్‌ ద్వీపంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు

Tsunami Warning : సాల్మన్‌ ద్వీపంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు
Advertisement

Tsunami Warning : పసిఫిక్‌ సముద్రంలో వరుస భూకంపాలు చోటు చేసుకొంటున్నాయి. సోమవారం ఇండోనేసియాలో భూకంపం పెనువిషాదాన్ని మిగిల్చింది. తాజాగా సాల్మన్‌ ద్వీపంలో భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

సాల్మన్‌ ద్వీపంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. భూకంప సమయంలో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. రాజధాని హోనైరికి ఆగ్నేయంగా దాదాపు 56 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది. మరోవైపు సాల్మన్ ద్వీప పరిసర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

సముద్ర అలలు భారీగా ఎగసిపడే ప్రమాదం ఉందని పసిఫిక్‌ సునామీ కేంద్రం హెచ్చరించింది. అయితే భారీ స్థాయిలో సునామీ ఉండకపోవచ్చని తెలిపింది. ఈ భూకంపం మీటరు ఎత్తు అలలు సృష్టించే అవకాశం ఉందని ప్రకటించింది. పపువా న్యూగినియా, వనవాటు లాంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొని ఉండొచ్చని పేర్కొంది. సాల్మన్‌ ద్వీపం పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉంది. ఇక్కడ చాలా అగ్నిపర్వతాలు సముద్రం అడుగున ఉన్నాయి. ఆ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూకంపాలు సంభవిస్తాయి.

ఇండోనేసియాలోని జావాను సోమవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. భూకంప కేంద్రమైన చియాంజుర్‌ ప్రాంతం తీవ్రంగా ధ్వంసమైంది. 162 మంది ప్రాణాలు కోల్పోయారని జావా గవర్నర్‌ రిద్వాన్‌ కమిల్‌ తెలిపారు.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×