BigTV English
Advertisement

DCIL Recruitment: డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

DCIL Recruitment: డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

DCIL Recruitment: డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. వైజాగ్ లోని సీతమ్మదారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. మరీ ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 25న దరఖాస్తు గడువు ముగియనుంది.

విశాఖపట్నంలోని సీతమ్మధారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DCIL).. కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22

ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కన్సల్టెంట్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్స్, హైడ్రో గ్రాఫిక్ సర్వేయర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్(ఓ/పీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, రెసిడెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వారీగా..

కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్: 04

ప్రాజెక్టు మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్ వర్స్క్‌: 01

హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 12

ప్రాజెక్టు కన్సల్టెంట్ (ఓ/పీ): 02

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కన్సల్టెంట్: 01

లీగల్‌ కన్సల్టెంట్: 01

రెసిడెంట్ మేనేజర్‌: 01

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు వయస్సు 45 నుంచి 60 ఏళ్లు మించి ఉండరాదు.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ పోస్టులకు, కన్సల్టెంట్ పోస్టులకు నెలకు రూ.1,50,000 – రూ.2,00,000 జీతం ఉంటుంది. ఇన్‌ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్స్ ప్రాజెక్ట్ మేనేజర్, రెసిడెంట్ మేనేజర్ పోస్టులకు రూ.50,000-రూ.65,000 జీతం ఉంటుంది. హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ పోస్టులకు రూ.25,000-రూ.40,000 జీతం ఉంటుంది. ఇతర పోస్టులకు రూ.1,00,000 – రూ.1,20,000 జీతం  ఉంటుంది. లీగల్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.50,000- రూ.70,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు కు చివరి తేది: 2025 ఫిబ్రవరి 25

Also Read: TG Ed.CET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పీఈ సెట్, ఎడ్‌సెట్ షెడ్యూల్ వచ్చేసింది..

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.dredge-india.com/

అర్హత ఉన్న అభ్యర్థులందరికీ ఇదే మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ నెల 25న దరఖాస్తు గడువు ముగియనుంది.

Related News

SBI Specialist: ఎస్బీఐలో స్పెషలిస్ట్ జాబ్స్.. రూ.లక్షల్లో వేతనాలు, ఇంకెందుకు ఆలస్యం

Railway NER: పది, ఐటీఐ అర్హతలతో ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 5 రోజులే గడువు

TGPSC Group 3: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 10 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

IRCTC Recruitment 2025: IRCTCలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు, ఆ డిగ్రీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

NABARD Notification: నిరుద్యోగులకు శుభవార్త.. నాబార్డులో ఆఫీసర్స్ ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

BEML Notification: భారత్ ఎర్త్ మూవర్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40000.. ఇంకెందుకు ఆలస్యం

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

Big Stories

×