Group-1 Exam Schedule: ఏపీ రాష్ట్ర గ్రూప్-1 అభ్యర్థులకు ఇది అలెర్ట్. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటనను జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది.
మే 3 నుంచి 9 వరకు గ్రూప్ మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. మెయిన్స్ రాత పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. మెయిన్ హాల్ టికెట్లను అఫీషియల్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అఫీషియల్ వెబ్ సైట్: psc.ap.gov.in
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ కు సంబంధించి మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్ లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే వ్యాస రూపంలో 200 నుంచి 300 పదాలల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యూల్ డేట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ సారి కూడా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ను ట్యాబ్ లలో పొందుపరిచి ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యద్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఈసారి గ్రూప్- 1 అభ్యర్ధులు రాసే ఆన్సర్ బుక్ లెట్ లను కూడా రూల్ పేపర్స్కి బదులు వైట్ పేపర్ల బుక్ లెట్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
2023 డిసెంబర్ నెలలో మొత్తం 89 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది మార్చి 17వ తేదీన ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. అదే ఏడాది ఏప్రిల్ నెలలో అధికారులు ఫలితాలను కూడా విడుదల చేశారు. అనంతరం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 1:50 ప్రాతిపదికన 4,496 మందిని మెయిన్స్కి ఎంపిక చేశారు. వీరందరికీ మే నెలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పరీక్ష కేంద్రాల్లో మెయిన్ పరీక్షలు జరగనున్నాయి.
గ్రూప్-1 మెయిన్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్. ఈ స్వల వ్యవధిలో చదివిన పుస్తకాలను చదవండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.
Also Read: CSIR-NEERI Recruitment: ఇంటర్ పాసైన వారికి బంపర్ ఆఫర్.. ఈ జాబ్ కొడితే నెలకు రూ.80,000 జీతం భయ్యా..
Also Read: Civil Services Results: సివిల్స్-2024 ఫలితాలు వచ్చేశాయ్.. మెరిసిన తెలుగు ఆణిముత్యాలు..