Indian Army TES 52 Notification 2024: ఇండియన్ ఆర్మీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 52వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. దీని ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ 2024 లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అవివాహిత పురుషులు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 13 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంది.
అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 60 శాతం మార్కులతో 10+2 లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. అంతే కాకుండా 2024 జేఈఈ మెయిన్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 16 ఏళ్ల 6 నెలల నుంచి 19 ఏళ్ల 6 నెలల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
ఎంపిక విధానం: స్టేజ్ 1, స్టేజ్ 2, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13.06.2024
Also Read: ఖాళీల భర్తీకి యూపీఎస్సీ సీడీఎస్ఈ (2)- 2024 నోటిఫికేషన్ విడుదల.. తొందరగా అప్లై చేసేయండి
వేతనం: మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ. 56,100 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. నాలుగేళ్ల శిక్షణ తరువాత పూర్తి వేతనం చెల్లిస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు.