E-Paper
Advertisement

TG ICET: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..

TG ICET: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..
Advertisement

TG ICET Notification: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎంబీఏ చేయాలని అనుకునే వారికి ఇది సువర్ణవకాశం. తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2025 (టీఎస్ఐసెట్)  నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సారి పరీక్ష నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) కండక్ట్ చేయనుంది.

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (టీఎస్‌ఐసెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది.  టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Advertisement

ALSO READ: IDBI Recruitment: డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.. జీతం రూ.6,50,000

అర్హత ఉన్న అభ్యర్థులు మే 3 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు జూన్‌ 8, 9 తేదీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్  కండక్ట్ చేయనున్నారు.

Advertisement

దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: మార్చి 10

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మే 3

రూ.250 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 26 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

హాల్ టికెట్ డౌన్ లోడ్ తేది: మే 28 నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎగ్జామ్ డేట్స్: జూన్ 8, 9 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

పరీక్ష ప్రాథమిక కీ విడుదల: జూన్‌ 21

ప్రాథమిక కీపై అభ్యంతరాలకు గడువు: జూన్ 22 నుంచి 26 వరకు.

ఐసెట్ తుది కీ రిలీజ్: జూలై 7

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (టీఎస్‌ ఐసెట్‌)  ద్వారా ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

ఎగ్జామ్ ద్వారా తీసుకునే కోర్సులు: ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఆప్లికేషన్స్) కోర్సులు ఉంటాయి.

విద్యార్హత: 

ఎంబీఏ కోర్సు: కనీసం 50 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీ/బీసీ 45శాతం) మార్కులతో ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ పాసై ఉండాలి

ఎంసీఏ కోర్సు: ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జె్క్టు చదివి ఉండాలి) పాసై ఉంటే సరిపోతుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.550 ఉంటుంది.

ఎగ్జామ్ సెంటర్స్: రాష్ట్రంలోని 16 టెస్ట్ జోన్ లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈ ఎంట్రన్స్ టెస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.

దరఖాస్తు సవరణకు తేదీలు: మే 16 నుంచి 20 వరకు సవరించుకోవచ్చు.

అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే మార్చి 10న ప్రారంభమయ్యే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు పెట్టుకోండి. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ALSO READ: UPSC Notification: సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో 357 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడుంటే..?

ముఖ్యమైన సమాచారం:

దరఖాస్తుక ప్రక్రయకు చివరి తేది: 2025 మే 3

పరీక్షల నిర్వహణ: జూన్‌ 8, 9

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×