Medchal Police Station: సైబరాబాద్ పోలీసులు ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందిస్తూ భద్రతా పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ వార్షికోత్సవం సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో సైబరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ముందుండి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ క్రైమ్పై కట్టడి, మహిళలు మరియు వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతూ ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
Also Read: Family Drama OTT : ఏడుగురు పిల్లల బాధ్యత ఒక్కడిపైనే… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన కథ
అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్లో సీఐ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పడి 24 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొ న్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రతి ఒక్కరు నిక్కచ్చిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్, మేడ్చల్ సీఐ సత్యనారాయణ, డి ఐ కిరణ్. ట్రాఫిక్ ఎస్సై పరశురాం. శ్రీనివాస్. ఎస్సై సురేష్. ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Box Office: యష్ ‘టాక్సిక్’తో మామూలుగా ఉండదు.. ‘ధురంధర్ 2’ ఏమాత్రం తప్పు చేసినా జరిగేది ఇదే!