E-Paper
Advertisement

Bhadrachalam: భద్రాచలానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

Bhadrachalam: భద్రాచలానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
Advertisement

Bhadrachalam: భద్రాచలానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఆ పేరు వెనక ఉన్న  చారిత్రక, ఆధ్యా్త్మిక ప్రాశస్త్యం  ఏంటో తెలుసా..? సాక్ష్యాత్తు శ్రీరాముడే భద్రాచలాన్ని ఎంచుకున్నాడన్న విషయం ఎంత మంది భక్తులకు తెలుసు..? భద్రాచలం పేరు వెనక ఉన్న ప్రాశస్యం ఆ పేరు రావడానకి గల కారణాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

భద్రాచలం అనే పేరు వెనుక చాలా కాలం నాటి మరియు ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. ఈ పేరుకి మూలం తెలుసుకోవడానికి ముందు  దాని ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయం అర్థం అవతుంది.

Advertisement

భద్రాచలం పేరుకు మూలం – పురాణ కథ:  భద్రాచలం అనే పేరు పూర్తిగా ఒక భక్తుని పేరు మీద మరియు ఒక చారిత్రక సంఘటనపై ఆధారపడి ఉంది. పురాణాల ప్రకారం పూర్వం భద్రుడు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడట. ఆయన పేరు మీదనే భద్రాచలానికి ఆ  పేరు వచ్చిందనే కథనం ఉంది.

బ్రహ్మదేవుడి అనుగ్రహం:  భద్రుడు అనే భక్తుడు  తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మదేవుని మెప్పించాడట. బ్రహ్మంగారి కాలజ్ఞానం మరియు దార్శనికత గురించి విన్న భద్రుడు, భవిష్యత్తులో ప్రజలకు శ్రీరాముని అనుగ్రహం పొందే మార్గాన్ని చూపించాలని బ్రహ్మదేవుడిని వరం కోరాడట.

Advertisement

శ్రీరాముని కోరిక: భద్రుని భక్తికి మెచ్చిన శ్రీరాముడు ఒకనాడు అతనికి కలలో కనిపించి ( స్వప్న దర్శనం) నువ్వు ఈ పర్వతం మీద నివసించు. నేను నీ కోసం ఈ పర్వతం మీద శాశ్వతంగా కొలువై ఉంటాను అని వరం ఇచ్చాడట.

భద్రాచలంగా మారిన పర్వతం: రాముని మాట ప్రకారం.. ఆయన చూపించిన పర్వతం ( ఇప్పుడున్న  భద్రాచలం కొండ) మీదకు వెళ్లిన భద్రుడు అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. అలా భద్రుడి తపస్సుకు మెచ్చిన శ్రీరాముడు భద్రుడిని తనలో ఐక్యం చేసుకున్నాడట. భద్రుడు తపస్సు చేసిన పర్వతం కాబట్టి దానికి భద్రాచలం అనే పేరు నిలిచిపోయిందని చెప్తుంటారు.

భద్రాచలం పేరుకు ఉన్న ఇతర అర్థాలు మరియు విశేషాలు: భద్ర అంటే శుభం, మంగళం, లేదా సురక్షితమైన అని అర్థం వస్తుందట. ఆచలం  అంటే కొండ లేదా పర్వతం, లేదా కదలకుండా ఉండేది అంటారట. అందుకే భద్రాచలాన్ని శుభాలను ఇచ్చే కొండ  అని కూడా అనుకోవచ్చట. శ్రీరాముడు ఇక్కడ కొలువై ఉండటం వల్ల, ఈ ప్రాంతం ప్రజలకు అన్ని రకాల శుభాలను, శాంతిని ఇస్తుందని భక్తులు  నమ్ముతుంటారు.

ఇక్కడ రాముడు సాధారణ రూపంలో కాకుండా, శంఖు చక్రాలతో కూడిన చతుర్భుజ రూపంలో దర్శనమిస్తాడు. సీతాదేవి ఆయన ఎడమ తొడపై కూర్చుని ఉంటుంది. ఈ క్షేత్రానికి  ప్రాముఖ్యత పెరగడానికి కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) కట్టించిన దేవాలయం, అలాగే ఆయన రాసిన కీర్తనలు ప్రధాన కారణం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: బ్రహ్మంగారి కాలజ్ఞానం – కలియుగం అప్పుడే అంతం అవుతుందట

 

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×