E-Paper
Advertisement

Maida Flour : మైదా ఎక్కువగా తింటే జరిగేది ఇదే

Maida Flour : మైదా ఎక్కువగా తింటే జరిగేది ఇదే

Maida Flour : ప్రస్తుతకాలంలో అందరూ అన్నానికి బదులుగా చపాతీలు, పరోటాలు, రోటీలు తింటుంటారు. అవి గోధుమ పిండితో తయారైనవి అయితే పర్వాలేదు కానీ మైదాపిండితో చేసినవి అయితే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు. మైదా పిండి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మైదా పిండి మెత్తదనం, తెల్లదనం కోసం ఎక్కువగా పాలిష్‌ చేస్తారు. క్లోరైడ్‌ గ్యాస్‌, బెంజయిల్‌ పెరాక్సైడ్‌ వంటి కెమికల్స్‌ కలుపుతారు. మైదాలో అల్లోక్సాన్‌ అనే విష రసాయనం కూడా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో ఖచ్చితంగా కొంత పీచు పదార్థం ఉండాలి. అయితే మైదాలో పీచుప‌దార్థం అస్సలు ఉండదు. దాంతో త్వరగా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుంటుంది. పేగుల్లో పుండ్లు కూడా ప‌డే ప్రమాదం ఉంది. పుండ్లు ముదిరి క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. మైదా పిండిని ఎక్కువగా గోడ‌ల‌కు పోస్టర్లను అంటించ‌డానికి వాడుతారు. మైదాలోని జిగురు పోస్టర్లు గోడ‌కు అంటుకునేలా చేస్తుంది. మైదా పదార్థాలను తిన్నప్పుడు మ‌న పేగుల‌కు కూడా అలాగే అతుక్కుపోతాయి. క్రిములు వచ్చి ఇన్ఫెక్షన్‌ల‌ను క‌లుగ‌జేస్తాయి. మైదా వల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా వస్తాయి. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మహిళలల్లో బ్రెస్ట్ సమస్యలు ఉత్పన్నమ‌వుతాయి. మైదాలో కేవలం పిండి పదార్థమే ఉండడం వల్ల పొట్ట పెరుగుతుంది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×