E-Paper
Advertisement

Nagarkurnool Crime: ప్రేమతో పెళ్లి.. ఆ తర్వాత హత్య.. నాగర్ కర్నూల్ లో దారుణ ఘటన

Nagarkurnool Crime: ప్రేమతో పెళ్లి.. ఆ తర్వాత హత్య.. నాగర్ కర్నూల్ లో దారుణ ఘటన

Nagarkurnool Crime: ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. అన్యోన్యంగా ఉండేవారు.. ఆ అన్యోన్యత మూడునాళ్ల ముచ్చటగానే సాగింది. ఆ ప్రేమ కాస్త ద్వేషంగా మారి, ఏకంగా కట్టుకున్న భర్తను కడతేర్చే వరకు తీసుకు వెళ్లడం విశేషం. ఈ దారుణ ఘటనకు దారి తీసింది మాత్రం అక్రమ సంబంధమేనని పోలీసులు తేల్చారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కీర్తి, జగదీష్ లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించగా, వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2011లో వీరిద్దరూ పెళ్లి చేసుకొని, తమ సంసారాన్ని సంతోషంగా సాగిస్తూ వచ్చారు. బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తూ జగదీష్, కుటుంబ పోషణ సాగించేవారు. అయితే కీర్తికి నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అంతేకాదు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగేదట.

ఆ విషయం గ్రహించిన జగదీష్ పలుమార్లు కీర్తిని వారించేవాడు. అయినా కీర్తి మాత్రం అదేరీతిలో తన ప్రవర్తన కొనసాగించేది. జగదీష్ నుండి రోజురోజుకి ఒత్తిడి అధికం కాగా, కీర్తి, నాగరాజుతో కలిసి తన భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది. భర్త ఒక్కడే ఉన్న సమయంలో నాగరాజుకు సమాచారం అందించి, ఏకంగా తన భర్తను హత్య చేసింది. ఇక్కడే కీర్తి అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది. జగదీష్ ను హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కీర్తి ప్రయత్నించింది.

Also Read: Rishiteshwari Case: రిషితేశ్వరి కేసులో కోర్టు సంచలన తీర్పు.. కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు..

అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు లోతుగా సాగించి, అసలు నిజాన్ని కక్కించారు. చివరకు తన భర్తను తానే హత్య చేసినట్లు, అందుకు నాగరాజుతో పాటు పలువురు సహకరించినట్లు అంగీకరించగా, ఈ కేసులో కీర్తితో పాటు నాగరాజును, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జగదీష్ చివరికి, తన భార్య చేతిలో హతం కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరించినా, హత్యగా తేల్చడంలో సఫలీకృతులయ్యారు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×