E-Paper
Advertisement

Online UPI Payments : టెక్నాలజీని తెగ వాడేస్తున్నారుగా… ఆన్ లైన్ పేమెంట్స్ విలువ రూ.12.11 లక్షల కోట్లు…

Online UPI Payments : టెక్నాలజీని తెగ వాడేస్తున్నారుగా… ఆన్ లైన్ పేమెంట్స్ విలువ రూ.12.11 లక్షల కోట్లు…
Advertisement

Online UPI Payments : ఒక్క అక్టోబర్ లోనే రూ.731 కోట్ల గ్రోత్

టీకొట్టుకెళ్లినా.. కూరగాలు, పాలు కొన్నా… నోట్లతో పనేలేదు. చిల్లర లేదనే టెన్షనే అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఫోన్ ఫేనో, గూగుల్ పేనో, పేటిఎం ద్వారానో పేమెంట్ చేసేయొచ్చు. చిన్నచిన్న వ్యాపారులు కూడా ఇంతకుముందులా డబ్బులు అడగడం లేదు. కొనుగోలు పూర్తికాగానే క్యూఆర్ కోడ్ ను ముందర పెడుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ సత్తా ఇది మరి. డిజిటల్ భారత్ తో ఇదంతా సాధ్యమవుతోందని ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. కేంద్రం యూపీఐ పేమెంట్స్ సిస్టం తీసుకొచ్చాక ఆన్ లైన్ పేమెంట్ విపరీతంగా పెరిగాయి. అవి ఎంతగా అంటే ప్రపంచంలోనే భారత్ ను ముందు స్థానంలో నిలబెట్టేటంత. ఒక్క అక్టోబర్ నెలనే తీసుకోండి. ఆ నెలలో రూ.731 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. గతంతో పోల్చితే ఇది 7.7 శాతం ఎక్కువ. ఈ ఒక్క నెల ట్రాన్సక్షన్స్ తో భారత్ లో మొత్తం యూపీఐ లావాదేవీల విలువ రికార్డు స్థాయిలో రూ. 12.11 లక్షల కోట్లకు చేరిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎన్.పి.సీ.ఐ. తెలిపింది.
ఇక సెప్టెంబర్ నెలలో ఆన్ లైన్ యూపీఐ లావాదేవీలు రూ.678 కోట్ల వరకు జరిగాయి. దీంతో సెప్టెంబర్ నెల వరకు మొత్తం యూపీఐ లావాదేవీలు రూ.11.16 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం పెరిగిన డిజిటల్ పేమెంట్స్ లో ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-ఐ.ఎం.పి.ఎస్ లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు. అంటే వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. మరోవైపు సెప్టెంబర్ నెలతో పోల్చితే ఎన్.ఇ.టి.సి. ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్స్ విలువ రూ.4,452 కోట్లకు పెరిగింది.
కరోనా వచ్చినప్పటి నుంచే మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయని చెప్పొచ్చు. నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రచారం జరగగానే జనం యూపీఐ పేమెంట్స్ పై ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. ఫలితంగా నోట్ల వాడకం విపరీతంగా తగ్గింది. డిజిటల్ పేమెంట్స్ ను మరింతగా పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… తాజాగా డిజిటల్ రుపీని తెచ్చింది. అయితే రిటైల్ రంగంలో ఇది అందుబాటులోకి రావడానికి మరో నెల పడుతుంది. ఇక ప్రతి నెల ఒక బిలియన్ అంటే వంద కోట్ల ఆన్ లైన్ లావాదేవీలు జరిగేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. అటు రిజర్వు బ్యాంకు కూడా ఇందుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేసింది. సురక్షితమైన, వేగవంతమైన, సులభమైన పద్దతుల్లో లావాదేవీలు జరిగేలా చూడడం ఇందులో ముఖ్యమైంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×