Big Stories

Brahmotsavam : కార్తీకమాసంలోనే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారు?

Brahmotsavam : పద్మావతీ అమ్మవారిని దర్శించకుండా తిరుపతిని వీడి వెళ్తే యాత్రా ఫలితం దక్కదని భక్తుల నమ్మకం. అందుకని తిరుపతికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకునేందుకు, భక్తులందరూ తప్పక వెళ్తారు.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను 8 రోజులపాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం నవంబరు 19న అంకురార్పణ చేపడతారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 15 న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా రెండేండ్ల తర్వాత ఆలయ మాడ వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

- Advertisement -

20-11-2022 ధ్వజారోహణం, చిన్నశేషవాహనం
21-11-2022 పెద్దశేషవాహనం, హంసవాహనం
22-11-2022 ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం
23 -11-2022 కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం
24 -11-2022 పల్లకీ ఉత్సవం, గజవాహనం
25-11-2022 సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడవాహనం
26-11-2022 సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
27-11-2022 రథోత్సవం, అశ్వ వాహనం
28-11-2022 పంచమీతీర్థం, ధ్వజావరోహణం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News