E-Paper
Advertisement

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

ఏపీ, తెలంగాణ‌లో ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ‌విడుదలైంది. డిప్లమా ట్రైనీ ఎలక్ట్రికల్, డిప్లమా ట్రైనీ సివిల్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలను ఈ నోటిషికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో https://www.powergrid.in/ అనే వెబ్ సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దేశ వ్యాప్తంగా మొత్తం 802 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో సదరన్ రీజియన్ కింద ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రీజియన్‌లో మొత్తం 72 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల్లో 29 అన్ రిజర్వ్డ్ కేటగిరి, 5 ఈడబ్ల్యూఎస్ కేటగిరి, 21 ఎస్సీ, 5 ఎస్టీ, 3 దివ్యాంగులు, 6 ఎక్స్ సర్వీస్ మ్యాన్, 2 డీఈఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారిగా అర్హత విషయానికి వస్తే… డీటీఈ పోస్టుకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లలో మూడేళ్ల రెగ్యులర్ డిప్లమా పూర్తిచేయాలి.

ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 70 శాతం మార్కులు రావాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పాస్ మార్కులు వస్తే అర్హులు. ఇక డీటీసీ పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల రెగ్యులర్ డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ఓబీసీ, జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 70 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పాస్ మార్కులు వస్తే సరిపోతుంది. జేఓటీ (హెఆర్) పోస్టుకు బీబీఏ, బీబీఎం, బీబీఎస్‌లతో పాటు వాటికి సమానమైన కోర్సులో మూడేళ్ల రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పాస్ మార్కులు వస్తే సరిపోతుంది.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×