BigTV English

Sensex : వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex : వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పెరిగి 59,960 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 17,787 పాయింట్ల దగ్గర ముగిసింది. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా… భారత సూచీలు ఈ వారాన్ని లాభాల్లో ముగించడం విశేషం.


ఉదయం 59,746 పాయింట్ల దగ్గర లాభాల్లో మొదలైన సెన్సెక్స్‌… ఇంట్రాడేలో 60,133-59,739 పాయింట్ల మధ్య ఊగిసలాడి… చివరికి 203 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్‌30 సూచీలో 21 షేర్లు లాభపడ్డాయి. మారుతీ, రిలయన్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడగా… టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి.

మరోవైపు… అమెరికా ట్రెజరీ రాబడులు మందగించడం, డాలర్ విలువ తగ్గడంతో… రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. 7 పైసలు బలపడ్డ రూపాయి… డాలర్ మారకం విలువతో పోలిస్తే 82 రూపాయలా 34 పైసల దగ్గర ముగిసింది. గత మూడు సెషన్లలో రూపాయి విలువ 50 పైసల మేర లాభపడటం విశేషం.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×