BigTV English
Advertisement

Survey: ఐటీ ఉద్యోగులూ బీఅలర్ట్.. సర్వేలో షాకింగ్ న్యూస్..

Survey: ఐటీ ఉద్యోగులూ బీఅలర్ట్.. సర్వేలో షాకింగ్ న్యూస్..
it employees

Survey: జాతీయ పోషకాహార సంస్థ.. ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యంపై ఆందోళనను వ్యక్తం చేసింది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడంతో అనేక రోగాల బారిన పడుతున్నారని హెచ్చరించింది. హైదరాబాద్‌ లోని ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేసిన సంస్థ.. 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేల్చింది.


ఐటీ రంగంలో పని చేస్తున్న ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. 35 ఏళ్ల లోపున్నవారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే ప్రమాదంలో ఉన్నారు. 30 సంవత్సరాల వయస్సు పైబడిన ఉద్యోగుల్లో ఆరోగ్య సమస్యలు మరింతగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం, తరచూ బయట తినడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.


ఐటీ కంపెనీల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అవసరమని జాతీయ పోషకాహార సంస్థ స్పష్టం చేసింది. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ఈ కేంద్రాలు పని చేయాలంది.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×