E-Paper
Advertisement

Survey: ఐటీ ఉద్యోగులూ బీఅలర్ట్.. సర్వేలో షాకింగ్ న్యూస్..

Survey: ఐటీ ఉద్యోగులూ బీఅలర్ట్.. సర్వేలో షాకింగ్ న్యూస్..
it employees

Survey: జాతీయ పోషకాహార సంస్థ.. ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యంపై ఆందోళనను వ్యక్తం చేసింది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడంతో అనేక రోగాల బారిన పడుతున్నారని హెచ్చరించింది. హైదరాబాద్‌ లోని ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేసిన సంస్థ.. 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేల్చింది.

ఐటీ రంగంలో పని చేస్తున్న ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. 35 ఏళ్ల లోపున్నవారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే ప్రమాదంలో ఉన్నారు. 30 సంవత్సరాల వయస్సు పైబడిన ఉద్యోగుల్లో ఆరోగ్య సమస్యలు మరింతగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం, తరచూ బయట తినడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.

ఐటీ కంపెనీల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అవసరమని జాతీయ పోషకాహార సంస్థ స్పష్టం చేసింది. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ఈ కేంద్రాలు పని చేయాలంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×