MLA Daggupati Prasad: కొద్దిరోజులుగా వైసీపీ నేతల మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. తనపై YCP నాయకులు దండుపాళ్యం బ్యాచ్ అని మాట్లాడడం సీరియస్ అయ్యారు. గతంలో వైసీపీ అధికారంలో చేసిన అన్యాయాలు మీకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. డ్రైవర్ సుబ్రమణ్యం, ఎస్సీ డాక్టర్ సుధాకర్ ఘటనలో మాటేంటని ప్రశ్నించారు.
వారం రోజులుగా తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారని, మీ చీకటి రాజకీయాలు అన్ని మాకు తెలుసన్నారు. ముఖ్యంగా అనంత వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై రుసరుసలాడారు. మీరు, మీ అనుచరులు, మా పార్టీలో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఊర్లో లేనప్పుడు ఇలాంటి ప్రచారాలు చేస్తారా? అసత్య ప్రచారం చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీస్శాఖని కోరినట్టు ప్రస్తావించారు.
ఎగ్జిబిషన్ గొడవ చాలా చిన్నదని, మా కార్యకర్తలను రక్తం వచ్చే విధంగా కొట్టారని అన్నారు. మరుసటి రోజే ఎస్పీ వద్దకు వెళ్లి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. అసలు ఎగ్జిబిషన్ టర్నోవర్ 10 లక్షలు ఉండదన్నారు. ఎగ్జిబిషన్ కు పర్మిషన్ ఇప్పించింది తానేనని, నంబూరి వైన్స్పై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఆ సమయంలో తాను ఊర్లో లేనని భావించి, బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మొదట దీని వెనుక ఎవరూ లేరని స్టేట్మెంట్ ఇచ్చారని, మళ్ళీ గంటకే దీని వెనుక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉన్నారని ఆరోపించడాన్ని తప్పుబట్టారు. అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ ఎక్కడ ఎమ్మెల్యే ఇక్కడ స్టాండ్ అవుతాడోనన్న భయం వారికి పట్టుకుందన్నారు.
నిద్ర లేని నుంచి బురద జల్లడమే కార్యక్రమంగా పెట్టుకున్నారని, కబ్జాలు ఎవరు చేసినా ఉపేక్షించే సమస్య లేదన్నారు. స్వప్న భూమిని కబ్జా మాకు సంబంధించినది కాదని, అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను ఆమెకు ఫోన్ చేశానని, లిఫ్ట్ చేయలేదన్నారు.
దానితో మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతీ విషయాన్ని ఎమ్మెల్యేకు ఆపాదించడం అలవాటుగా మారిపోయిందని, నిన్న ఆడియో ఎప్పుడో జరిగిందని, ఆ ఇష్యూ టూ టౌన్ సీఐ అప్పుడే పంచాయతీ చేశారన్నారు. మా పార్టీ వాటిని నిశితంగా పరిశీలిస్తుందని, చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. మా పార్టీలోని కొంతమంది సీనియర్లు చీకటి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.