E-Paper
Advertisement

Tirupati district: కొడుకుపై ప్రేమ.. శ్మశానంలో సీసీ కెమెరాలు పెట్టించిన తండ్రి

Tirupati district: కొడుకుపై ప్రేమ.. శ్మశానంలో సీసీ కెమెరాలు పెట్టించిన తండ్రి

Tirupati district: తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఒక వినూత్న సంఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. క్షుద్ర పూజల భయంతో ఒక తండ్రి తన కుమారుడి సమాధి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంచలనం సృష్టించింది.

చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన ఒక దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అనారోగ్య కారణాలతో ఆ బాలుడు వారం రోజుల క్రితం మృతి చెందాడు. ఆ బాలుడు ఆ దంపతులకు మొదటి సంతానం కావడంతో..  మృతదేహాన్ని క్షుద్ర పూజల కోసం దుండగులు వెలికి తీసే అవకాశం ఉందని స్థానికులు బాలుడి తండ్రిని హెచ్చరించారు.

మొదట్లో భయపడిన తండ్రి..  కుమారుడి సమాధిని రక్షించుకోవడానికి ఇద్దరు వ్యక్తులను కాపలాగా పెట్టాడు. అయితే..  దీని కోసం రోజుకు రూ. 1,500 వరకు ఖర్చు అవుతుండటంతో పాటు..  రాత్రి వేళల్లో నిఘా కష్టతరంగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఆయన ఒక వినూత్న ఆలోచన చేశాడు.

స్మశానవాటికలో బాలుడి సమాధి వద్ద 360 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాడు. దీని ద్వారా తన మొబైల్ నుంచే ఎప్పటికప్పుడు సమాధి వద్ద పరిస్థితులను గమనిస్తున్నాడు.

నమ్మకాలకు, సాంకేతికతకు మధ్య జరిగిన ఈ పోరాటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మూఢనమ్మకాల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది.

ALSO READ: Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×