Prabhas vs Thalapathy Vijay: తెలుగు..తమిళ సినిమా పరిశ్రమల మధ్య.. ఉన్న వ్యత్యాసాలు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా విడుదల కాబోతున్న సంక్రాంతి..సినిమాల విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు విజయ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఘన స్వాగతం లభిస్తుంటే.. మరోవైపు ప్రభాస్ సినిమాకు తమిళనాడులో మాత్రం సరైన థియేటర్లు దక్కడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెలలో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ది రాజా సాబ్ జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు విజయ్ నటించిన డబ్బింగ్ సినిమా జన నాయగన్..తెలుగులో జననాయకుడుగా.. విడుదలకు సిద్ధమవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేమీ..తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమా మొదటి రోజే మంచి సంఖ్యలో స్క్రీన్స్ పొందుతోంది. థియేటర్ యజమానులు కూడా ఆ సినిమాకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అయితే దీనికి పూర్తి భిన్నంగా తమిళనాడులో పరిస్థితి ఉంది. భారతదేశంలోనే పెద్ద స్టార్గా పేరు పొందిన ప్రభాస్కు.. అక్కడ సరైన స్క్రీన్స్ ఇవ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు హీరో అయినప్పటికీ ప్రభాస్కు తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా ఈసారి ఆయన సినిమా అక్కడ వెనుకబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..విజయ్ సినిమా ఒక తెలుగు సినిమా రీమేక్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి..ఆధారంగా తీసుకున్న కథ అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై దర్శకుడు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇది రీమేక్ కాదు అని..ఖండించకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది.
మొత్తానికి చూస్తే..విజయ్కు తెలుగు రాష్ట్రాల్లో పల్లకీ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుండగా.. ప్రభాస్కు తమిళనాడులో మాత్రం ఆశించిన గౌరవం దక్కడం లేదన్న అభిప్రాయం ఏర్పడింది. భవిష్యత్తులో సినిమా విడుదలయ్యాక అసలు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. అప్పటివరకు ఈ అంశం తెలుగ.. తమిళ సినీ అభిమానుల మధ్య పెద్ద చర్చగానే కొనసాగనుంది.
ALSO READ: Prabhas remuneration: రాజా సాబ్ సినిమా వల్ల ప్రభాస్ కి 50 కోట్లు నష్టమా?