E-Paper
Advertisement

Last Rites : అంతిమ సంస్కారాల్లో మొలతాడు ఉండకూడదా..?

Last Rites :  అంతిమ సంస్కారాల్లో మొలతాడు ఉండకూడదా..?
Advertisement

Last Rites : మనిషి మరణించిన తర్వాత మొలత్రాడు కూడా వూడబెరికి మట్టి చేస్తారు. లేదా దహనం చేస్తారు. ఎలా వచ్చాడో అలాగే సంస్కారం చేస్తారు. దిగంబరంగా ఈ భూమికి వస్తారు…దిగంబరంగానే వదిలి వెళతారు.

జననం ప్రారంభం, మరణం ప్రారబ్ధం. చావుకీ, పుట్టకకూ మధ్య ఉండే సమయమే జీవిత. పుట్టబట్టలేదు. చావు బట్టలేదు నడుమ ఈబట్టకనగుబాటుకాదుకో అన్నాడు వేమన. దిగంబరుడు వేమన కవి కాబట్టి అలా చెప్పి ఉండవచ్చు. వేదాంతులకు , సన్యాసులకు బట్టలక్కర్లేదు. వారి ప్రపంచం వేరు. కానీ నాగరిక సమాజంలో నడిచేవాడికి బట్టలు కావాల్సిందే.

Advertisement

దేహాన్ని విడిచిన జీవుడు, మోక్షానికి నడిపించేవి ధర్మ నిష్ట, సత్యదీక్ష. ఈ రెండు మాత్రమే. మనిషి బ్రతికున్నంతకాలం పెళ్లాం, బిడ్డల కోసం అన్యాయం, అక్రమాలు చేసి ఎందరినో మోసగించి ధనం సంపాదించి మరణించిన వ్యక్తిని చూడు. ఈ శవాన్ని చూసైనా తెలివి తెచ్చుక మనిషీ అని చెప్పడం ఈ ఉద్దేశం. భార్య వాకిలిదాకా, కొడుకు కాటి దాకా, మాత్రమే రాగలడు. జీవం లేని దేహం మట్టి కాబోయే ముందు కట్టుబట్టలే కాదు మొలత్రాడు కూడా మిగలదు .

మనిషి మరణించిన తర్వాత అంతిమ సంస్కారం చేయబోయే ముందు స్నానం చేయించి కొత్త బట్ట కడతారు. భూ స్థాపితం లేదా దహనం చేసే టప్పుడు ముందు బట్టలు తొలగించి మొలత్రాడు కూడా తీసివేసి మట్టి చేస్తారు. బతికున్న కాలంలో ఎన్ని పనులు చేసినా ఎంత కూడబెట్టినా మరణించిన తర్వాత మొలత్రాడు కూడా నీకు చెందదని చెప్పడమే ఇందులో ఆంతర్యం.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×