BigTV English

Last Rites : అంతిమ సంస్కారాల్లో మొలతాడు ఉండకూడదా..?

Last Rites :  అంతిమ సంస్కారాల్లో మొలతాడు ఉండకూడదా..?

Last Rites : మనిషి మరణించిన తర్వాత మొలత్రాడు కూడా వూడబెరికి మట్టి చేస్తారు. లేదా దహనం చేస్తారు. ఎలా వచ్చాడో అలాగే సంస్కారం చేస్తారు. దిగంబరంగా ఈ భూమికి వస్తారు…దిగంబరంగానే వదిలి వెళతారు.


జననం ప్రారంభం, మరణం ప్రారబ్ధం. చావుకీ, పుట్టకకూ మధ్య ఉండే సమయమే జీవిత. పుట్టబట్టలేదు. చావు బట్టలేదు నడుమ ఈబట్టకనగుబాటుకాదుకో అన్నాడు వేమన. దిగంబరుడు వేమన కవి కాబట్టి అలా చెప్పి ఉండవచ్చు. వేదాంతులకు , సన్యాసులకు బట్టలక్కర్లేదు. వారి ప్రపంచం వేరు. కానీ నాగరిక సమాజంలో నడిచేవాడికి బట్టలు కావాల్సిందే.

దేహాన్ని విడిచిన జీవుడు, మోక్షానికి నడిపించేవి ధర్మ నిష్ట, సత్యదీక్ష. ఈ రెండు మాత్రమే. మనిషి బ్రతికున్నంతకాలం పెళ్లాం, బిడ్డల కోసం అన్యాయం, అక్రమాలు చేసి ఎందరినో మోసగించి ధనం సంపాదించి మరణించిన వ్యక్తిని చూడు. ఈ శవాన్ని చూసైనా తెలివి తెచ్చుక మనిషీ అని చెప్పడం ఈ ఉద్దేశం. భార్య వాకిలిదాకా, కొడుకు కాటి దాకా, మాత్రమే రాగలడు. జీవం లేని దేహం మట్టి కాబోయే ముందు కట్టుబట్టలే కాదు మొలత్రాడు కూడా మిగలదు .


మనిషి మరణించిన తర్వాత అంతిమ సంస్కారం చేయబోయే ముందు స్నానం చేయించి కొత్త బట్ట కడతారు. భూ స్థాపితం లేదా దహనం చేసే టప్పుడు ముందు బట్టలు తొలగించి మొలత్రాడు కూడా తీసివేసి మట్టి చేస్తారు. బతికున్న కాలంలో ఎన్ని పనులు చేసినా ఎంత కూడబెట్టినా మరణించిన తర్వాత మొలత్రాడు కూడా నీకు చెందదని చెప్పడమే ఇందులో ఆంతర్యం.

Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×