E-Paper
Advertisement

Turmeric For Skin: పసుపులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది తెలుసా ?

Turmeric For Skin: పసుపులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది తెలుసా ?
Advertisement

Turmeric For Skin: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి , బిజీ లైఫ్‌లో కారణంగా చాలా మంది చర్మాన్ని అస్సలు పట్టించుకోలేకపోతున్నారు. దీని వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో వీటిని వదిలించుకోవడానికి కొందరు బయట మార్కెట్‌లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అంతే కాకుండా మరికొందరైతే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి రకరకాల ఫేషియల్ ట్రీట్‌మెంట్లు చేయించుకుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రమే.. తాత్కాలికంగా స్కిన్ మెరిసిపోయానా  కూడా కొన్ని రోజుల తర్వాత అంతా మామూలై పోతుంది. అందుకే ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలను వాడి ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

ముఖ్యంగా అందరి వంటగదిలో ఉండే పసుపు చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మొటిమలు, మచ్చల వంటి సమస్యలను నిమిషాల్లో వదిలించుకోవడానికి ప్రత్యేకమైన పరిష్కారం ఇది. దీని ద్వారా ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండానే మీ ముఖం కోల్పోయిన కాంతిని తిరిగి పొందవచ్చు. కాబట్టి పసుపును సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పసుపుతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
పసుపు- 1 టీ స్పూన్
కొబ్బరి నూనె- కాస్త
తేనె- 1 టీ స్పూన్

తయారీ విధానం: పసుపుతో ఫేస్ ప్యాక్ చేయడానికి, ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 టీస్పూన్ పసుపు వేయండి. తర్వాత ఆ పసుపులో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కలపాలి. అనంతరం 1 టీస్పూన్ తేనె కూడా వేసి మిక్స్ చేయండి. దీని తరువాత, రెండింటినీ బాగా కలపండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ మచ్చలు మరియు మచ్చలపై అప్లై చేయండి. తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ని వారానికి 2 నుండి 3 సార్లు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీ ముఖంపై మెరుపు పెరుగుతుంది. అంతే కాకుండా మీ ముఖంపై ఉన్న మచ్చలు కూడా మాయమవుతాయి.

Advertisement

పసుపులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. తేనెలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఇది మొటిమలను కూడా పూర్తిగా నియంత్రిస్తుంది. పసుపు ,తేనెతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

Also Read: వీటిని వాడితే.. ఎంతటి తెల్ల జుట్టు అయినా క్షణాల్లోని నల్లగా మారడం ఖాయం

తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి. బయట మార్కెట్ లొ దొరికే ప్రొడక్ట్స్ వాడే బదులు పసుపుతో ఇలా ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడటం మంచిది. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

Big Stories

Advertisement
×