Digestion: భోజనం తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడానికి, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను నివారించడానికి కొన్ని అద్భుతమైన అలవాట్లు పాటించాల్సి ఉంటుంది. ఇదెలా ఉంటే రాత్రి భోజనం చేసిన తర్వాత మన జీర్ణ వ్యవస్థకు సరైన విశ్రాంతిని, సహాయాన్ని అందించడం చాలా ముఖ్యం. రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి.. కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా ఆహారం త్వరగా.. సమర్థవంతంగా జీర్ణం అవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. వాకింగ్:
భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం ఒక అత్యుత్తమ అలవాటు. ఇది జీర్ణ వ్యవస్థలోని కండరాలను ఉత్తేజ పరుస్తుంది. అంతే కాకుండా ఆహారం త్వరగా కదలడానికి సహాయ పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
2. వెంటనే పడుకోకపోవడం:
భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా వాలుకోవడం మానుకోవాలి. అలా చేయడం వల్ల కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటను కలిగిస్తాయి. కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు నిటారుగా కూర్చోవాలి లేదా నిలబడాలి.
3. గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీ:
భోజనం తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగడం జీర్ణక్రియ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. అల్లం , సోంపు లేదా పిప్పరమెంటు వంటి హెర్బల్ టీలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది.
4. వజ్రాసనంలో కూర్చోవడం:
భోజనం తర్వాత 5 నుంచి 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరం. ఈ ఆసనం పొత్తికడుపు ప్రాంతానికి రక్త ప్రసరణను పెంచి, ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
5. సోంపు నమలడం:
భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం అనేది సహజ సిద్ధమైన జీర్ణక్రియ సహాయకారి. ఇందులో ఉన్న నూనెలు జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచి, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణాన్ని తగ్గించడంలో సహాయ పడతాయి.
6. డీప్ బ్రీతింగ్ :
భోజనం తర్వాత కొన్ని నిమిషాలు లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ప్రేరేపించబడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా దీని వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
7. మసాజ్:
మీ పొత్తికడుపుపై మీ చేతివేళ్లతో సున్నితంగా, సవ్యదిశలో నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల పేగుల్లో ఆహారం కదలిక మెరుగు పడుతుంది. తద్వారా గ్యాస్ , ఉబ్బరం వంటివి తగ్గుతాయి.
8. భోజనం త్వరగా పూర్తి చేయడం:
నిద్ర పోవడానికి కనీసం 2-3 గంటల ముందు రాత్రి భోజనం పూర్తి చేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ పూర్తి కావడానికి తగినంత సమయం లభిస్తుంది. ఫలితంగా నిద్ర నాణ్యత కూడా మెరుగు పడుతుంది.
9. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం:
భోజనం చేసిన వెంటనే పెద్ద మొత్తంలో చల్లటి నీరు లేదా ఇతర ద్రవాలు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్లు పలుచబడి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే కొద్ది మొత్తంలో గోరు వెచ్చని నీరు తాగడం ఉత్తమం.
10. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోకపోవడం:
భోజనం తర్వాత ఒత్తిడి, ఆందోళన కలిగించే ఆలోచనలు లేదా పనులకు దూరంగా ఉండాలి. అధిక ఒత్తిడి జీర్ణక్రియను అడ్డుకుంటుంది. ఏదైనా ప్రశాంతమైన పనుల్లో నిమగ్నమవడం మంచిది.
ఈ అలవాట్లు మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా.. రోజూ మీకు మంచి అనుభూతిని అందిస్తాయి.