E-Paper
Advertisement

Hinduism Rules: పొరపాటున కూడా ఈ ఐదుగురి పాదాలను తాకి నమస్కరించకూడదు, అలా చేస్తే పాపం!

Hinduism Rules: పొరపాటున కూడా ఈ ఐదుగురి పాదాలను తాకి నమస్కరించకూడదు, అలా చేస్తే పాపం!
Advertisement

హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో పెద్దలను గౌరవించడం ముఖ్యం. వారి పాదాలను తాకి నమస్కరించడం అనేది ఎంతో పవిత్రమైనదిగా చెబుతారు. ఎవరైనా పెద్దవారికి కాలికి నమస్కరించకపోతే వారిని తిట్టేవారు కూడా ఉన్నారు. కానీ పొరపాటున కూడా కొంతమంది పాదాలను తాకకూడదు అని హిందూ ధర్మం చెబుతోంది. వారి పాదాలను తాకడం వల్ల పుణ్యానికి బదులు పాపాన్ని మూటకట్టుకుంటారని వివరిస్తోంది. ఎవరి పాదాలను తాకి నమస్కరించకూడదో తెలుసుకోండి.

ఆలయంలో ఉన్నప్పుడు
మతపండితులు చెబుతున్న ప్రకారం మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పెద్దవారిని కలవడం, గొప్ప వ్యక్తులని కలవడం వంటివి చేస్తారు. ఆ సమయంలో కొంతమంది తెలియక వారి పాదాలను తాకి నమస్కరిస్తారు. ఆలయంలో ఉన్నప్పుడు ఎవరి పాదాలను తాకి నమస్కారం చేయకూడదు. ఒక మతపరమైన ప్రదేశంలో దేవుడు మాత్రమే ఉత్తముడు. అతడిని మించిన వారు లేరు. అతని సమక్షంలోనే మీరు వేరొకరి పాదాలను తాకితే అది దేవుడిని అవమానించినట్లే.

Advertisement

మావయ్య పాదాలను
పౌరాణిక నమ్మకాలు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి తనకు మేన మామ వరస అయ్యే వారి పాదాలను తాకకూడదు. శ్రీకృష్ణుడు తన మేనమామ అయినా కంసుడిని చంపాడు. అప్పటినుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. కాబట్టి మీకు మేనమామ  ఉంటే వారి పాదాలను తాకి నమస్కరించడం పూర్తిగా మానేయండి.

కన్యను తాకనివ్వకండి
శాస్త్రాల ప్రకారం కన్యగా ఉన్న అమ్మాయి దేవతా స్వరూపంతో సమానం. అలాంటి కన్యగా ఉన్న అమ్మాయిని మీ పాదాలను తాకి నమస్కారం చేయకుండా అడ్డుకోండి. కొంతమంది అమ్మాయిలు తెలియక తమకన్నా పెద్దవారికి నమస్కారం చేస్తారు. ఆమె కన్య అయితే మీకు నమస్కారం చేయకూడదు. ఆమె చేత మీ పాదాలను తాకనివ్వకూడదు. ఇలా చేయడం ద్వారా మీరు పాపం మూట కట్టుకున్న వారు అవుతారు. మీరు చేసిన మంచి పనులు కూడా కరిగిపోతాయి.

Advertisement

నిద్రపోతున్న వ్యక్తి
సనాతన ధర్మం చెబుతున్న ప్రకారం నిద్రలో ఉన్న వ్యక్తి పాదాలను తాకడం పూర్తిగా నిషిద్ధం. పడుకున్న స్థితిలో ఉన్న వ్యక్తి మరణించిన వ్యక్తిలా కనిపిస్తారు. అటువంటి పరిస్థితుల్లో నిద్రపోతున్న వ్యక్తి పాదాలకు మీరు నమస్కారం చేస్తున్నారంటే అతన్ని మీరు చనిపోయిన వ్యక్తిగా భావిస్తున్నారని అర్థం. ఇది చాలా తప్పు. కాబట్టి ఎవరైనా నిద్ర వస్తున్న సమయంలో వారి పాదాలకు నమస్కరించడం వంటి పనులు చేయకండి.

పిల్లనిచ్చిన మామకు
వేదాల ప్రకారం అల్లుడు తనకు పిల్లనిచ్చిన మామ గారి పాదాలను తాకడం నిషిద్ధం. సతీ దేవి యాగంలో తనను తాను దహనం చేసుకున్న తర్వాత శివుడు ఎంతో కోపంగా ఉంటాడు. ఆ కోపంలో తనకు పిల్లనిచ్చిన మామ అయిన దక్షుడి తలని నరికేస్తాడు. ఆ రోజు నుంచి ఈ నియమం అమలులోకి వచ్చింది. అప్పటి నుండి అల్లుడు తనకు పిల్లనిచ్చిన మామ గారి పాదాలను తాకడం పూర్తి తప్పుగా భావించడం మొదలుపెట్టారు.

Tags

Related News

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

Big Stories

Advertisement
×