దేశంలో అత్యధిక శాతం భారతీయులు భోజనంలో రైస్ (అన్నం) తింటారు. ఈ క్రమంలో చాలా మంది మిగిలిన అన్నాన్ని రేపటి భోజనం కోసం రెఫ్రిజిరేటర్లో పెట్టేస్తారు. కొందరు రెఫ్రిజిరేటర్ అన్నం క్యాన్సర్కు కారణం అవుతుందని భయపడతారు. రాయ్పూర్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ జయేష్ శర్మ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. సరైన విధంగా నిల్వ చేస్తే అన్నం సురక్షితంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. రెఫ్రిజిరేటర్లో పెట్టిన అన్నం తినడం వల్ల క్యాన్సర్కు కారణమని ఉంది. అయితే ఇదంతా తప్పుడు సమాచారం. వాస్తవానికి సమస్య అన్నంలో కాదు, తప్పు నిల్వ పద్ధతుల్లో ఉంది. వేడి అన్నాన్ని ఎక్కువ సేపు బయట ఉంచితే బ్యాక్టీరియా పెరుగుతుంది.
వండిన అన్నాన్ని 2 గంటల్లోపు రెఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఎయిర్టైట్ డబ్బాలో ఉంచడం మంచిది. రెఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉండాలి. 1-2 రోజుల్లో ఉపయోగించేయాలి.
ఫ్రిజ్లో నుంచి తీసిన అన్నం బాగా వేడి చేసి తినాలి. ఆవిరి బాగా వచ్చేలా వేడి చేయాలి. ఒక్కసారి వేడి చేసిన అన్నం మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. వాసన లేదా రుచి మారితే తినకూడదు.
చల్లగా ఉండే రైస్లో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ మోతాదు ముఖ్యం.
Also Read: వేసవిలో బీర్ కాక్టైల్స్కు పెరుగుతున్న డిమాండ్.. ఇంట్లో ఇలా తయారు చేయండి
వండిన అన్నం రాత్రంతా బయట ఉంచడం, మూత లేకుండా రెఫ్రిజిరేటర్లో ఉంచడం. ఒకసారి ఫ్రిజ్లో పెట్టిన అన్నం పదేపదే వేడి చేయడం వంటి తప్పులు చేయకూడదు.
రెఫ్రిజిరేటర్లో పెట్టిన అన్నం సరైన విధంగా నిల్వ చేసి, బాగా వేడి చేసి తిన్నంతవరకు సురక్షితం. ఇది క్యాన్సర్కు కారణం కాదు. ఆహార భద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి సమస్య రాదు. తాజా, శుభ్రమైన ఆహారం తినడం ఎప్పుడూ మంచిది.