E-Paper
Advertisement

నేరేడు పండ్లు తింటున్నారా? ఈ పదార్థాలతో కలిపి తింటే ప్రాణాలకే ప్రమాదం!

నేరేడు పండ్లు తింటున్నారా? ఈ పదార్థాలతో కలిపి తింటే ప్రాణాలకే ప్రమాదం!
Advertisement

Jamun Side Effects: నల్లటి రంగు, అద్భుతమైన రుచితో నోరూరించే నేరేడు పండ్లు (జామూన్) కేవలం రుచిలోనే కాదు. ఆరోగ్యానికి కూడా ఒక వరం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి.. ఇవి ఒక సంజీవని లాంటివి. అయితే.. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ సూపర్ ఫుడ్‌ను ఎలా పడితే అలా తింటే అమృతం కాస్తా విషంగా మారే ప్రమాదం ఉంది. నేరేడు పండ్లను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో తీవ్రమైన టాక్సిన్లు విడుదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేరేడు పండ్లు – ఆరోగ్యం, జాగ్రత్తలు:
వర్షాకాలం ప్రారంభంలో.. దొరికే నేరేడు పండ్లలో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయ పడతాయి. అయితే.. తప్పుడు కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. క్వాలిటీ గైడ్‌లైన్స్, హెల్త్ జర్నల్స్ ప్రకారం.. నేరేడు పండ్లతో కలిపి తీసుకోకూడని ఆ 5 ముఖ్యమైన పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

1. పాలు, పాల పదార్థాలు:
నేరేడు పండ్లు తిన్న వెంటనే చాలా మంది పాలు తాగడం లేదా మిల్క్ షేక్స్ లాంటివి చేస్తుంటారు. కానీ.. ఇది పూర్తిగా తప్పుడు పద్ధతి. నేరేడు పండ్లలో ఉండే యాసిడ్ గుణాలు, పాలలో ఉండే ప్రొటీన్లతో చర్య జరుపుతాయి. దీని వల్ల పాలు కడుపులోనే విరిగిపోయి గ్యాస్, ఎసిడిటీ, తీవ్రమైన కడుపునొప్పికి దారితీస్తుంది. జామూన్ తిన్న తర్వాత కనీసం ఒకటి నుంచి రెండు గంటల వరకు పాలకు దూరంగా ఉండాలి.

2. ఖాళీ కడుపుతో తినడం, పచ్చళ్లు:
చాలా మంది ఉదయాన్నే పరగడుపున నేరేడు పండ్లు తింటారు. నేరేడు పండు పుల్లగా ఉంటుంది. ఖాళీ కడుపుతో దీనిని తినడం వల్ల కడుపులో మంట, వికారం, ఎసిడిటీ పెరుగుతాయి. అలాగే భోజనంలో పచ్చళ్లతో పాటు లేదా పచ్చళ్లు తిన్న వెంటనే.. నేరేడు పండ్లను తీసుకోకూడదు. ఈ రెండింటి కలయిక కడుపులో తీవ్రమైన యాసిడ్ రిఫ్లక్స్‌ను కలిగిస్తుంది.

Advertisement

3. నీరు తాగడం:
నేరేడు పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం సర్వసాధారణంగా చేసే తప్పు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. నేరేడులోని ఫైబర్, నీటితో కలిసినప్పుడు కడుపు ఉబ్బరం, విరేచనాలు లేదా కలరా వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జామూన్ తిన్న తర్వాత అరగంట వరకు నీరు తాగకపోవడమే మంచిది.

4. పసుపుతో కలిపి తీసుకోవడం:
మనం తినే ఆహారంలో.. పసుపు సాధారణంగా ఉంటుంది. కానీ నేరేడు పండ్లు తిన్న వెంటనే.. పసుపు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. జామూన్ లోని పోషకాలు, పసుపులోని కర్కుమిన్ అనే రసాయనంతో ప్రతికూలంగా స్పందిస్తాయి. దీని వల్ల కడుపులో అసౌకర్యం, మంట, టాక్సిసిటీ పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

Also Read: కేవలం 7 రోజుల్లో కొలెస్ట్రాల్ తగ్గించుకోండి..ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

5. అధికంగా ఉప్పు చల్లుకోవడం:
నేరేడు పండ్ల వగరు పోవడానికి చాలామంది ఎక్కువ మొత్తంలో ఉప్పు లేదా చాట్ మసాలా చల్లుకుని తింటారు. ఇది రక్తపోటు ఉన్నవారికి చాలా ప్రమాదకరం. జామూన్ లో సహజంగానే సోడియం ఉంటుంది. దీనికి అదనంగా ఉప్పు చేర్చడం వల్ల శరీరంలో వాపులు రావడం, కిడ్నీలపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. వాటిని పరిమితంగా, సరైన పద్ధతిలో తిన్నప్పుడే పూర్తి ప్రయోజనాలు అందుతాయి. రోజుకు 50 నుంచి 100 గ్రాముల కంటే ఎక్కువ నేరేడు పండ్లను తినకూడదు. ఒక వేళ మీకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా సర్జరీలు జరిగి ఉంటే.. డాక్టర్లు సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. సరైన ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య పని ఒత్తిడి.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×