Monsoon Dehydration: చలికాలం, ఎండాకాలంలోనే కాదు.. వర్షాకాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణం వల్ల మనకు దాహం వేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. వానాకాలంలో చల్లని గాలుల వలన నీరు ఎక్కువగా తాగడానికి చాలామంది ఇష్టపడరు. దీంతో శరీరంలో తీవ్రమైన వేడికి గురవుతుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య తలెత్తి.. కిడ్నీల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో చాలామంది నీళ్లు తాగడం బాగా తగ్గిస్తారు. అయితే, ఈ కాలంలో గాలిలో ఉండే తేమ (హ్యుమిడిటీ) వల్ల మనకు తెలియకుండానే చెమట రూపంలో శరీరం నుంచి నీరు బయటకు పోతుంది. పైగా వర్షాకాలంలో వచ్చే విరేచనాలు, వాంతులు, జ్వరాల వల్ల కూడా ఒంట్లో నీటి శాతం వేగంగా తగ్గిపోయి డీహైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది.
Also Read: కీటకాలు, నెగటివ్ ఎనర్జీ మాయం.. ఇంటి మెయిన్ డోర్ వద్ద ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు కిడ్నీలకు రక్తప్రసరణ మందగిస్తుంది. దీనివల్ల కిడ్నీల పనితీరు హఠాత్తుగా దెబ్బతిని ‘అక్యూట్ కిడ్నీ ఇంజూరీ’ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మూత్రం బాగా చిక్కగా మారిపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI) వంటి సమస్యలు కూడా ఈ కాలంలో ఎక్కువగా వస్తుంటాయి.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, డయాబెటిస్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ ముప్పు చాలా ఎక్కువ. అలాగే ఎక్కువ సమయం ఏసీల్లో ఉంటూ నీళ్లకు బదులు టీ, కాఫీలు ఎక్కువగా తాగే ఆఫీస్ ఉద్యోగులు కూడా సులభంగా డీహైడ్రేషన్కు గురవుతారు.
దాహం వేయకపోయినా రోజుకు సరిపడా మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం నీళ్లే కాకుండా మజ్జిగ, ఉప్పు కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. మూత్రం రంగు లేత పసుపు లేదా తెల్లగా ఉంటే తగినంత నీరు తాగుతున్నారని అర్థం. వానాకాలంలోనూ కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవడానికి నీరు తాగడం అస్సలు మర్చిపోకూడదు.
Also Read: వాషింగ్ మెషీన్లో వెనిగర్ వేస్తే ఏమౌతుందో తెలుసా? ఇన్నాళ్లూ ఈ సూపర్ ట్రిక్ తెలియక నష్టపోయాం!