Throat Infection: జలుబు లేదా అలర్జీల వంటివి తీవ్రమైనప్పుడు గొంతు నొప్పి సర్వసాధారణం. కొన్ని సార్లు గొంతు నొప్పి వల్ల తినడం, తాగడం వంటివి కష్టం అవుతాయి. అందుకే ముందుగానే దీనిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తీవ్రమైన గొంతు నొప్పిని ఎదుర్కున్నప్పుడు హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కొన్ని సార్లు హోం రెమెడీస్ కూడా తక్కువ సమయంలోనే సమస్య నుంచి బయటపడేలా చేస్తాయి. అంతే కాకుండా గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి వాటిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇంతకీ గొంతు నొప్పిని తగ్గించడానికి ఎలాంటి టిప్స్ పాటించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పిని తగ్గించే హోం రెమెడీస్:
ఉప్పు నీటితో పుక్కిలించండి:
మీకు గొంతు నొప్పి ఉంటే.. ఉప్పు నీటితో పుక్కిలించండి. ఇది గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని.. దానికి రెండు చిటికెడు ఉప్పు కలపండి. ఈ నీటితో ఐదు నిమిషాలు పుక్కిలించండి. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంద. అంతే కాకుండా గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగించడంలో కూడా ఉపయోగపడుతుంది.
ములేతి:
ఆయుర్వేద గుణాలతో సమృద్ధిగా ఉన్న లైకోరైస్ గొంతు నొప్పిని తగ్గించడంలో ప్రభావ వంతంగా ఉంటుంది. దీని కోసం.. 1 అంగుళం లైకోరైస్ ముక్కను తీసుకోండి. దానిని మీ నోటిలో ఉంచుకుని 1 నుంచి 2 గంటలు పీల్చుకోండి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
అల్లం:
మీకు గొంతు నొప్పి ఉంటే అల్లం కషాయం తాగడం వల్ల మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో ప్రభావ వంతంగా ఉండటమే కాకుండా.. మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది గొంతు నొప్పి ,జలుబును కూడా తగ్గిస్తుంది. అల్లం కషాయాన్ని తయారు చేయడానికి.. 1 అంగుళం అల్లం ముక్కను చూర్ణం చేసి, ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. తర్వాత.. ఈ నీటిని తాగాలి.
తులసి కషాయం:
తులసి ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కషాయాన్ని సిద్ధం చేయడానికి.. ఒక కప్పు నీటిని తీసుకొని, 10 నుంచి 15 తులసి ఆకులను వేసి, వేడి చేసి, ఆపై, కొద్దిగా తేనె వేసి తినండి. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
Also Read: పచ్చి బొప్పాయి వారానికి 3 సార్లు తింటే.. ఈ రోగాలు రమ్మన్నా రావు
పసుపు పాలు:
జలుబు, గొంతు నొప్పిని తగ్గించడానికి పసుపు పాలు చాలా ఆరోగ్యకరమైనవి. ఈ పాలు మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. మీకు గొంతు నొప్పి ఉంటే, ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడిని కలిపి తాగండి. ఇది గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సింపుల్ హోం రెమెడీస్ ట్రై చేయవచ్చు. సమస్యలు తీవ్రం అయితే మాత్రం డాక్టర్ను తప్పకుండా సంప్రదించండి.