BigTV English

Rice Flour For Skin Glow: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఇలా చేస్తే.. మచ్చ లేని చర్మం

Rice Flour For Skin Glow: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఇలా చేస్తే.. మచ్చ లేని చర్మం

Rice Flour For Skin Glow: పురాతన కాలం నుండి బియ్యం పిండి చర్మానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా చర్మంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మపు రంగును కాంతివంతం చేస్తుంది . సహజమైన మెరుపును కూడా తెస్తుంది. బియ్యం పొడి చర్మం ఎక్స్‌ఫోలియేషన్‌కు కూడా ఉపయోగపడుతుంది. బియ్యం పిండిని వాడటం వల్ల మృత కణాలు తాజాదనం పెరుగుతుంది. బియ్యం పిండి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలు , ఇతర చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.


ఖరీదైన ఫేస్ క్రీములను వాడకుండా బియ్యం పిండితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల మీ ముఖం సహజంగా కాంతివంతంగా మారుతుంది. మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1.బియ్యం పిండి, నెయ్యి తో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
బియ్యం పిండి- 1 టేబుల్ స్పూన్
నెయ్యి- తగినంత


బియ్యం పొడి, నెయ్యి కలిపిన పేస్ట్ మీ చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా చేస్తుంది. అంతే కాకుండా నెయ్యి చర్మానికి లోతైన తేమను అందిస్తుంది. అయితే బియ్యం పిండి చర్మంపై మచ్చలను తేలికపరచడంలో సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక చెంచా బియ్యం పొడిలో నెయ్యి కలిపి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వాడటం వల్ల మీ చర్మం కాంతివంతంగా , మృదువుగా మారుతుంది.

2. బియ్యం పిండి, పెరుగుతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
బియ్యం పిండి: 1 టేబుల్ స్పూన్
పెరుగు: 1 టీ స్పూన్

బియ్యం పిండి, పెరుగు ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మొటిమలు , మంటను కూడా తగ్గిస్తుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం. దీని కోసం ముందుగా ఒక చెంచా బియ్యం పొడిని ఒక చెంచా పెరుగుతో కలిపి ముఖానికి 15-20 నిమిషాలు అప్లై చేసి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. బియ్యం పొడి, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
బియ్యం పొడి- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం- 1 టీ స్పూన్

Also Read: జుట్టుకు హెన్నా, హెయిర్ డైలను వాడుతున్నారా ?

బియ్యం పొడి, నిమ్మరసం చర్మాన్ని తాజాగా ఉంచడానికి, మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి. నిమ్మరసంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలోని మురికిని శుభ్రపరిచి తాజాగా ఉంచుతుంది. దీనిని తయారు చేయడానికి, ఒక చెంచా బియ్యం పొడిని ఒక చెంచా నిమ్మరసంతో కలిపి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. ముఖంపై మచ్చలు తొలగించడంలో కూడా బియ్యం పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. తరచుగా వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి మెరుపునిస్తాయి.

Related News

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Big Stories

×