E-Paper
Advertisement

Rice Water For Glowing Skin: బియ్యం నీటితో ముఖాన్ని మెరిపించండిలా..

Rice Water For Glowing Skin: బియ్యం నీటితో ముఖాన్ని మెరిపించండిలా..
Advertisement

Rice Water For Glowing Skin: జుట్టు రాలడం నుంచి మచ్చలేని చర్మం వరకు అన్ని సమస్యలకు చెక్ పెట్టే దివ్వౌషదం రైస్ వాటర్.. ఎందుకంటే వరల్డ్ వైడ్‌గా లేటెస్ట్ స్కిన్ కేర్ ట్రెండ్‌లలో.. బియ్యం నీళ్లు మంచి గుర్తింపు పొందింది. కొరియన్ స్కిన్ కేర్ రహస్యం కూడా రైస్ వాటరేనట. బియ్యం నీళ్లు కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. అందంగా ఉండాలని ఎవరకి మాత్రం ఉండదు చెప్పండి. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో కనిపించే బ్యూటీ టిప్స్‌ను కూడా పాటిస్తుంటారు. అయినా ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి రైస్ వాటర్‌తో ఈ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి మంచి ఫలితం ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రైస్ వాటర్, పొటాటో రసం, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, పొటాటో రసం, రైస్ వాటర్ రెండు స్పూన్లు , రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తొలగిపోతాయి.

Advertisement

రైస్ వాటర్, అలోవెరా జెల్, విటమిన్ క్యాప్సూల్స్
చిన్న గిన్నె తీసుకుని అందులో రైస్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్యూల్స్ రెండు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై ముడతలు తగ్గి, తాజాగా మెరుస్తుంది.

రైస్ వాటర్, కాఫీ పొడి, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ రైస్ వాటర్, కాఫీ పొడి రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం టీ స్పూన్, షుగర్ టీ స్పూన్, తేనె టీ స్పూన్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత.. సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై మురికి తొలగిపోయి.. కాంతివంతంగా మెరుస్తుంది.

Advertisement

శెనగపిండి, రైస్ వాటర్, పెరుగు ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి, రైస్ వాటర్, పెరుగు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత.. గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు తగ్గి మిల మిల మెరుస్తుంది.

Also Read: సిట్రస్ పండ్లు మంచివే.. కానీ అతిగా తింటే ఆ సమస్యలు రావచ్చు..!

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×