E-Paper
Advertisement

Curd in Winter: చలికాలంలో రాత్రిపూట పెరుగు తినకూడదా? తింటే ఏమవుతుంది?

Curd in Winter: చలికాలంలో రాత్రిపూట పెరుగు తినకూడదా? తింటే ఏమవుతుంది?
Advertisement

చలికాలం వచ్చిందంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రి భోజనంలో ఎలాంటి ఆహారం తినాలి? అనే విషయంలో ఎంతో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో రాత్రిపూట పెరుగు తినకూడదనే అభిప్రాయం ఎక్కువ మందికి ఉంది. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో ప్రొబయాటిక్స్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు ఉండటం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. దీన్ని రాత్రిపూట తినడం మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో నిపుణులు వివరిస్తున్నారు.

ఆయుర్వేదం ఏం చెబుతుంది?
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం మంచిది కాదు. రాత్రి సమయంలో శరీరంలో సహజంగా కఫ శక్తి ఎక్కువగా ఉంటుంది. పెరుగు శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. కఫం అధికంగా పెరగడం, మ్యూకస్ ఏర్పడడం వంటి పరిస్థితులను తేలికగా పెంచుతుంది. దీని వల్ల శ్వాస మార్గాల్లో గడ్డలు, దగ్గు, జలుబు, నాసిక సమస్యలు వచ్చి, నిద్ర సరిగ్గా రాకుండా మారవచ్చు. ముఖ్యంగా శ్వాస సమస్యలున్నవారు లేదా తరచూ దగ్గు, జలుబు సమస్యలు ఎదుర్కొనే వారు రాత్రి పెరుగు తినడం వలన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు.

Advertisement

రాత్రిపూట పెరుగు తినడం వల్ల జీర్ణక్రియపై కూడా ప్రభావం ఉంటుంది. రాత్రి పూట శరీరం విశ్రాంతి తీసుకునే స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో పెరుగు తినడం వల్ల కొంతమందికి అసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్, జీర్ణ సమస్యలు రావచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం రాత్రి పెరుగు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియలో కొంత భారం పెరగవచ్చని సూచిస్తున్నాయి. అందువల్ల రాత్రి పెద్ద మోతాదులో పెరుగు తినడం మంచిదని చెప్పలేము. నిజానికి రాత్రి తినాల్సినవారు ఉంటే తేలికగా చేసిన రైటా లేదా మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది.

వీరు తినకూడదు?
పెరుగు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ, దాన్ని ఎప్పుడు, ఎంత మోతాదులో తినాలనే విషయంపై మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రాత్రి తినడం వల్ల శరీరంలో కఫ పెరగడం, జీర్ణక్రియలో ఇబ్బందులు రావడం, శ్వాస మార్గాల్లో మ్యూకస్ ఎక్కువగా ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల శ్వాస సమస్యలున్నవారు, జీర్ణ శక్తి సున్నితంగా ఉన్నవారు, తరచుగా దగ్గు, జలుబు సమస్యలు ఎదుర్కొనే వారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పెరుగును రాత్రి తినకపోవడం మంచిది. నిపుణులు చెప్పినట్టు రాత్రి బదులు మధ్యాహ్న భోజనం సమయంలో తినడం శరీరానికి తేలికగా ఉంటుంది. లాభాలూ ఎక్కువగా అందుతాయి. ఈ విధంగా ఆరోగ్యం, జీర్ణక్రియ, నిద్ర, శ్వాసమార్గ సమస్యలను నియంత్రించడం సులభమవుతుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×