E-Paper
Advertisement

యూరిన్ రంగు మారుతోందా? అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే!

యూరిన్ రంగు మారుతోందా? అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే!

Kidney health warning signs: శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీల పాత్ర అమూల్యమైనది. చాలా మంది యూరిన్ చేసేటప్పుడు దాని రంగును పెద్దగా పట్టించుకోరు. కానీ.. రంగులో వచ్చే మార్పులు మీ శరీరంలో అంతర్గతంగా జరుగుతున్న అనారోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. సాధారణంగా లేత పసుపు రంగులో ఉండాల్సిన యూరిన్.. ముదురు పసుపు, ఎరుపు లేదా నురుగుతో కూడి ఉంటే అది కిడ్నీ వ్యాధులకు సంకేతం కావచ్చు. మీ యూరిన్ రంగు దేనిని సూచిస్తుందో.. ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలో తెలుసుకుందామా..

యూరిన్ రంగు మారుతోందా? కిడ్నీ ఆరోగ్యంపై హెచ్చరికలు:
మన శరీరంలో నీటి శాతం.. మనం తీసుకునే ఆహారం, మందులు , కిడ్నీల పని తీరును బట్టి యూరిన్ రంగు మారుతుంటుంది. ఏ రంగు దేనికి సంకేతమంటే..

1. లేత పసుపు లేదా పారదర్శకం:
ఇది మీ శరీరం ఆరోగ్యంగా ఉందని, మీరు తగినంత నీరు తాగుతున్నారని చెప్పడానికి సంకేతం. మీ కిడ్నీలు చక్కగా పనిచేస్తున్నాయని దీని అర్థం.

2. ముదురు పసుపు లేదా అంబర్ రంగు :
మీరు తక్కువ నీరు తాగుతున్నారని దీని అర్థం. శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు మూత్రం గాఢత పెరిగి ముదురు రంగులోకి మారుతుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. వెంటనే నీరు తాగడాన్ని పెంచడం అవసరం.

3. ఎరుపు లేదా గులాబీ రంగు :
ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. ఆహారంలో బీట్‌రూట్ వంటివి తీసుకోకుండానే ఈ రంగు వస్తుంటే.. యూరిన్ లో రక్తం పడుతోందని అర్థం. ఇది కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లు లేదా కిడ్నీ క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు. ఇలాంటి సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

4. నురుగుతో కూడిన యూరిన్:
యూరిన్ చేసేటప్పుడు ఎక్కువగా నురుగు వస్తుంటే.. అది కిడ్నీల వడపోత వ్యవస్థ దెబ్బతిన్నదని సూచిస్తుంది. రక్తంలోని ‘అల్బుమిన్’ అనే ప్రొటీన్ యూరిన్ ద్వారా బయటకు పోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కి ప్రధాన లక్షణం.

Also Read: ఆరోగ్యానికి మంచిదే కదా.. అని అల్లం టీ తాగుతున్నారా ?

5. ఆరెంజ్ లేదా బ్రౌన్ రంగు :
యూరిన్ టీ రంగులో లేదా గోధుమ రంగులో వస్తుంటే అది కిడ్నీ సమస్యలతో పాటు లివర్ (కాలేయం) వ్యాధులకు కూడా సంకేతం కావచ్చు. పైత్యరసం రక్తంలో కలవడం వల్ల ఇలా జరుగుతుంది.

కిడ్నీలను కాపాడుకోవడానికి చిట్కాలు:
నీరు తగినంత తాగాలి: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.

ఉప్పు తగ్గించాలి: ఆహారంలో ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉంటే అది రక్తపోటును పెంచి కిడ్నీలను దెబ్బతీస్తుంది.

మందుల వాడకం: పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) అతిగా వాడటం కిడ్నీలకు అత్యంత ప్రమాదకరం.

రెగ్యులర్ చెకప్: డయాబెటిస్, బీపీ ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) చేయించుకోవాలి.

Related News

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

Big Stories

×