Actor Sivaji : గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ‘శివాజీ వర్సెస్ హీరోయిన్స్’ వివాదం పీక్ స్టేజ్కు చేరుకుంది. ‘దండోర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మహిళల బట్టలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో, పరిస్థితి తీవ్రతను గమనించిన శివాజీ మీడియా సమావేశం నిర్వహించి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు.
అనసూయ vs శివాజీ
తన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి, పాయిల్ రాజ్పుత్, నిధి అగర్వాల్ వంటి వారు స్పందించిన తీరుపై కూడా శివాజీ మాట్లాడారు. కొందరు కావాలనే వారికి ట్యాగ్ చేసి వివాదాన్ని పెద్దది చేస్తున్నారని, కనీసం ఒక్కరైనా తనతో మాట్లాడి సారీ చెప్పమని అడిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ నిప్పులు చెరిగారు. అతి వినయం ధూర్త లక్షణం” అంటూ శివాజీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమ్మా, తల్లీ అని పిలుస్తూనే అదుపు చేయాలనుకునే వారే చాలా ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.
పశ్చాత్తాపం.. కానీ స్టేట్మెంట్కు కట్టుబడే
ప్రెస్ మీట్లో శివాజీ తన తప్పును అంగీకరించారు. ఆ వేదికపై నేను రెండు అనుచితమైన పదాలు వాడాను. అది నా తప్పే. ఆ మాటలకు గానూ అందరికీ సిన్సియర్గా క్షమాపణలు చెబుతున్నాను అని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అయితే, మహిళల వస్త్రధారణ పద్ధతిగా ఉండాలన్న తన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడి ఉంటానని స్పష్టం చేయడం గమనార్హం.
ప్రెస్ మీట్ తర్వాత పరుగో పరుగు
అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ప్రెస్ మీట్ ముగియగానే మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగకముందే శివాజీ అక్కడి నుంచి ఒక్క ఉదుటన రన్నింగ్ అందుకున్నారు. ఎవరూ ఆపకుండా, నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్లి కారు ఎక్కేయడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
నెటిజన్ల ట్రోల్స్
శివాజీ పరిగెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఏంటి శివాజీ గారు.. అంతలా పరిగెడుతున్నారు? సామాన్లు కొనడానికి వెళ్తున్నారా? అంటూ కొందరు ఆయన వాడిన పదాన్నే వాడుతూ ట్రోల్ చేస్తున్నారు. అక్కడ నిరసనకారులు ఉన్నారన్న భయంతోనే శివాజీ అంత వేగంగా పారిపోయారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పిన తీరు కంటే, ఆయన అక్కడి నుంచి నిష్క్రమించిన తీరుపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది.