E-Paper
Advertisement

Renudesai: మనుషులు మొత్తం పోతారు.. రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!

Renudesai: మనుషులు మొత్తం పోతారు.. రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Renudesai:ప్రముఖ హీరోయిన్ రేణూదేశాయ్ (Renudesai)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం సింగిల్ పేరెంట్ గా కెరియర్ కొనసాగిస్తున్న ఈమె.. తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే మరొకవైపు సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. అయితే ఈమధ్య గత కొంతకాలంగా స్ట్రీట్ డాగ్స్ విషయంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా ఈమె చేస్తున్న కామెంట్లు కొంతమందికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అంతేకాదు పలు విమర్శలకు కూడా దారి తీస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈమె మరో వీడియో షేర్ చేసి మనుషులు మొత్తం పోతారు అంటూ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాను ఉదహరించి మరీ చెప్పడంతో ఇప్పుడు మరింత నెగెటివిటీ పెరిగిందని చెప్పాలి.

వీధి కుక్కల దాడులపై రేణూదేశాయ్ ఆవేదన..

విషయంలోకి వెళ్తే.. వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తోంది. మరొకవైపు వీధి కుక్కలపై ప్రజలు దాడులు చేస్తున్నారంటూ ప్రెస్ మీట్ నిర్వహించి మరీ కుక్కల అంశంపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి. అలా ప్రెస్ మీట్ లో భాగంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తుండగా.. మరి కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తన మాటలను తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్.

నా మాటలను వక్రీకరించారు..

Advertisement

తాజాగా రేణు దేశాయ్ విడుదల చేసిన ఆ వీడియోలో.. ప్రెస్ మీట్ లో తాను ఏం చెప్పాలనుకున్నానో.. ఆ తర్వాత వివాదం ఎందుకు జరిగిందో అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను 30 నిమిషాల పాటు మాట్లాడితే అందులో చిన్న చిన్న క్లిప్పింగ్స్ ను తమకు నచ్చినట్టుగా కట్ చేసి వేరే అర్థం వచ్చేలా వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా నా వ్యాఖ్యల ఉద్దేశాన్ని వక్రీకరించడం వల్లే ఈ రాద్ధాంతం ఏర్పడింది. మనుషులైనా.. జంతువులైనా.. అందరూ బాగుండాలని మాత్రమే నేను కోరుకుంటాను. కొన్ని సందర్భాలలో కుక్కల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న విషయాన్ని నేను ప్రస్తావించగానే.. అందుకే అన్ని కుక్కలను చంపేయాలని నేను అన్నట్లు నా మాటలు వక్రీకరించారు..నేను ఎక్కడ ఈ మాట చెప్పలేదు. సమస్యను మానవీయంగా, శాంతియుతంగా పరిష్కరించాలని నేను అభిప్రాయపడ్డాను.

జంతువులలాగే మనుషులు కూడా పోవాల్సిందే..

ఈ జీవితం తాత్కాలికం మాత్రమే.. కుక్కలు, పిల్లులు, కోతులు మాత్రమే కాదు.. మనుషుల జీవితము శాశ్వతం కాదు.. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిందే .. కాబట్టి ద్వేషం, ఆగ్రహంతో కాకుండా సహజీవన భావనతో ముందుకు వెళ్లాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను కూడా ఆమె ఉదాహరణగా ప్రస్తావించడం మరో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ నటించిన కల్కి సినిమా చూశారా? అదే కలియుగం.. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి వారైనా సరే అందరం అక్కడికి వెళ్లాల్సిందే కదా.. కాబట్టి ప్రశాంతంగా, మంచిగా ఉండాలని సూచించింది. ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Sharwanand: శర్వానంద్ ఊహించని నిర్ణయం.. భవిష్యత్తులో ఇబ్బంది రాదు కదా!

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×