Chandrasekhar Reddy: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నాయకుడు కే చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy) గత రెండు రోజులుగా భూ కబ్జా ఆరోపణలలో భాగంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలుస్తుంది. మంత్రీ కాస్మోస్ ప్రాజెక్ట్కు సంబంధించిన భూమి విషయంలో ఈయన తన అనుచరుల సహాయంతో దాడి చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇలా ఈయనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.
ఈ విధంగా తన పట్ల భూకబ్జా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) మామ కె చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చారు. గత రెండు రోజులుగా భూ కబ్జా విషయంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో ఈయన మాట్లాడుతూ తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా ఆరోపణలకు తన అల్లుడు అల్లు అర్జున్ కు ఏ మాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని, ఆ భూమికి సంబంధించి చట్టపరంగా అన్ని హక్కులు తనకే ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
సునీల్ అనే వ్యక్తితో కలిసి నానక్రామ్గూడ (Nankramguda)ప్రాంతంలోని రైతుల నుంచి భూములను కొనుగోలు చేశామని తెలిపారు. మొత్తం 10 ఎకరాల భూమిలో తాను మూడు ఎకరాలు, సునీల్ మూడు ఎకరాలు కొనుగోలు చేసాము అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా మా వద్ద ఉన్నాయి. తాము ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదు, ఎలాంటి దాడులు చేయలేదని సెక్యూరిటీపై దాడి చేశాము అంటూ వస్తున్న వార్తలు అన్నీ పూర్తిగా ఆ వాస్తవమని ఈయన ఖండించారు.
ఈ విషయంలో తనపై అనవసరంగా కేసులు నమోదు చేశారని అయితే నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ, ఆ భూమి తన సొంతమని మరోసారి తెలియజేశారు. ఇక ఈ కేసుతో తన అల్లుడికి సంబంధం లేదని అసలు ఇక్కడ భూమి ఉందని అది ఎవరి పేరు మీద ఉందనే విషయం తెలియదని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇలా ఈయన ఈ భూ కబ్జా వివాదం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
?stkn=MTN3cDlwYjV1YzJ5NQ%3D%3D
ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రడ్డి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద కుమార్తె అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తో పాటు పలు వ్యాపారాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు. ఇలా తన మామ గురించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో భూ కబ్జా ఆరోపణలతో కేసు నమోదు అయినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఈ విషయాలు గురించి ఎక్కడ స్పందించలేదు ప్రస్తుతం ఈయన తన రాకా సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు.
Also Read: ఉదయ భాను ఆ హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పారా?