Anchor Suma Reacts on Shivaji Comments: నటుడు శివాజీ హీరోయిన్లపై చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపుతున్నాయో తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాలే ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శివాజీ హద్దులు దాటారని, రాజ్యాంగాన్ని ధిక్కరించారంటూ ఆయనపై సినీ నటీనటులు మండిపడుతున్నారు. శివాజీ కామెంట్స్ స్పందించిన మంచు మనోజ్ ఆయన తరపు క్షమాపణలు కోరారు. ఇక యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయిలు శివాజీకి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. మహిళ సంఘాలు సైతం మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
అయితే మొదట తన వ్యాఖ్యల పట్ల శివాజీ మొండివైఖరి చూపించారు. తాను క్షమాపణలు చెప్పేదేలేదని తేల్చారట. కానీ, కాసేటి క్రితమే వెనక్కి తగ్గి క్షమాపణలు కోరారు. దీంతో ఈ వివాదం సద్దుమనిగిందని అనుకున్నారు. కానీ, ఆయన క్షమాపణలు చెప్పిన కూడా మహిళలు, హీరోయిన్ల శరీరంపై వస్త్రాధారణపై ఆయన చేసిన మాటలు కించపరిచే విధంగా ఉండటంతో ఆయనకు తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలో శివాజీ తీరు స్టార్ యంకర్ సుమకు తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు. నిజానికి యాంకర్ సుమ వివాదాలకు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఎక్కడ ఏం జరిగిన ఆమె మౌనంగానే ఉంటారు.
Also Read: Actor Shivaji: హీరోయిన్లపై అనుచిత కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శివాజీ
దారుణమైన సంఘటనలు తప్పిదే ఆమె పెద్దగా స్పందించారు. యాంకర్ సుమ రియాక్ట్ అయ్యిందంటే ఆ వివాదం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు శివాజీ వివాదంపై సుమ స్పందించారు. మహిళలకు రక్షణ కల్పించడం.. ఆంక్షలు పెట్టడం ఒక్కటి కాదని పేర్కొంది. తన ఎక్స్ పోస్ట్ లో సుమ ఇలా రాసుకొచ్చారు. “ఇటీవల నేను ఎకో అనే మూవీ చూశాను. సినీ ఇండస్ట్రీలో ఇటీవల నిధి అగర్వాల్, సమంతకు జరిగిన సంఘటనలు మనకు హెచ్చరికలాంటివి. ఇలాంటివీ చూస్తుంటే మహిళలకు భద్రత, గౌరవం ఎక్కడుందనిపిస్తోంది. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని వదిలేయడం అంటే ఇంకా పెంచి పోషించడమే అవుతుంది” అని యాంకర్ సుమ తన పోస్టులో రాసు కొచ్చారు. ఈ సంఘటనలను మహిళలు ప్రశ్నిస్తూనే ఉంటారని చివరిలో సమ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Recently watched a film called eko which says Protection and restriction are not the same. pic.twitter.com/5ozSvvYUhq
— Suma Kanakala (@ItsSumaKanakala) December 23, 2025
శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దండోరా. క్రిస్మస్కి ఈ చిత్రం విడుదల కానుంది. ఈనేపథ్యంలో మూవీ టీం నిన్న ప్రీ రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ.. ఓ కార్యక్రమాల్లో హీరోయిన్లు నిధి అగర్వాల్, సమంతలకు ఎదురైన సంఘటనపై స్పందించాడు. వాటిని ఉద్దేశిస్తూ.. నటీమణుల దుస్తులపై ఆయన అనుచిత కామెంట్స్ చేశారు. సామాన్లు కనపడేలా డ్రెస్సులు ధరించొద్దని.. చీరలోనే అందంగా ఉంటారని వెటకరించారు. అదే సమయంలో కొన్ని అసభ్యకర పదాలు వాడారు. దీంతో శివాజీ చేసిన కామెంట్స్పై అనసూయ, చిన్మయితో సహా పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు శివాజీ.