AK47 Update: విక్టరీ హీరో వెంకటేష్ నటిస్తున్న.. కొత్త సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్లో కొత్త అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. నటుడు నారా రోహిత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహం తెచ్చింది.
ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం.. AK 47 అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంతేకాదు..త్రివిక్రమ్ ఈ చిత్రానికి..బంధు మిత్రుల అభినందనలతో అనే సంప్రదాయ తెలుగు శీర్షికను కూడా రిజిస్టర్ చేసినట్టు సమాచారం. పెళ్లి పత్రికల్లో తరచూ వినిపించే ఈ మాటలు, తెలుగు సంప్రదాయం, కుటుంబ విలువలను.. గుర్తు చేస్తాయి. అందుకే ఈ టైటిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఇదే తొలిసారి దర్శకుడు..హీరోగా కలిసి పని చేయడం. అయితే గతంలో త్రివిక్రమ్ రచయితగా నువ్వు నాకు నచ్చావ్.. వాసు.. మల్లీశ్వరి వంటి సినిమాలకు కథ అందించారు. ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకత్వంలో ఈ ఇద్దరి కలయిక ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారని సమాచారం. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. వెంకటేష్ ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో క్యామియో పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకటేష్ క్రేజ్ మరింత పెరిగింది. మరోవైపు త్రివిక్రమ్ గత చిత్రం గుంటూరు కారం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ ఇద్దరికీ చాలా కీలకం.
మొత్తం పైన..వెంకటేష్–త్రివిక్రమ్–నారా రోహిత్ కలయికతో రూపొందుతున్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమా విడుదలయ్యే వరకు ఈ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ALSO READ: Roger Allers Death: ది లయన్ కింగ్ సినిమా దర్శకుడు మృతి..!