E-Paper
Advertisement

Art Director Ramakrishna: రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందన్నారు.. కానీ!

Art Director Ramakrishna: రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందన్నారు.. కానీ!

Art Director Ramakrishna:ఇటీవల 70వ ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ (Rama Krishna)తనకు అవార్డు రాకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తూ ఆవేదన చెందారు . ముఖ్యంగా తనకు రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారని, కనీసం రాష్ట్ర అవార్డు కూడా రాలేదు అంటూ ఆయన వాపోయారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రాష్ట్ర అవార్డు రాకపోవడం పై ఆర్ట్ డైరెక్టర్ అసహనం..

సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) తొలిసారి అంగవైకల్యం ఉన్న పాత్రలో నటించి తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 2018 వరకు రామ్ చరణ్ పై విమర్శలు గుప్పించిన వారు.. ఈ సినిమా తర్వాత ఆయన నటనను ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం. ఇకపోతే ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రామకృష్ణ తనకు ఎలాంటి అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. కనీసం రాష్ట్ర అవార్డు కూడా రాకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామకృష్ణ మాట్లాడుతూ.. “రంగస్థలం సినిమాలో నటనకు గాను రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని అందరం అనుకున్నాము. ఆయనకే కాదు ఈ సినిమాలో ఎంతోమందికి అవార్డ్స్ రావాలి. కానీ ఎవరికి రాలేదు. సౌండ్ డిజైనర్ కి మాత్రమే వచ్చింది. లక్కీగా ఆయనకు రావడంతో మేమంతా సంతోషంగా ఫీల్ అయ్యాము.

ALSO READ:Samantha: వ్యక్తిగత జోలికొస్తే ఊరుకోను.. సోషల్ మీడియా ట్రోల్స్ పై సమంత ఘాటు రిప్లై!

సెట్ అని వాళ్లకు తెలియదేమో..

అయితే నేను పని చేస్తూ ఎంజాయ్ చేసింది రంగస్థలం, అంతరిక్షం సినిమాలకు మాత్రమే. రంగస్థలం రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. రియలిస్టిక్ స్టోరీ.. ఇది సెట్ అని అవార్డ్స్ ఇచ్చే వాళ్లకు తెలీదు. ఊరిలో షూటింగ్ చేశామని అనుకున్నారు. అందుకేనేమో రాష్ట్ర అవార్డు ఇవ్వలేదు. నేషనల్ అవార్డు కూడా రాలేదు. రామ్ చరణ్ కూడా నేషనల్ అవార్డు గెలుచుకుంటారని నాతో అన్నారు..కానీ జరగలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికైతే అంత రియలిస్టిక్ గా సినిమాను తెరకెక్కించారు కాబట్టే.. అది సెట్ అని తెలియక తనకు అవార్డు రాకపోయి ఉండవచ్చు అని ఆయనే అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే రామకృష్ణ మాటలు విన్న తర్వాత ఈయన చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే 2018కి గాను తెలుగు ప్రేక్షకులు చాలామంది రామ్ చరణ్ కి అవార్డు వస్తుందని అలాగే ఇందులో వేసిన సెట్స్ కి కూడా గుర్తింపు లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అలాంటిదేం జరగలేదు.

అప్పటికి ఇంకా ఈ పాన్ ఇండియా ట్రెండు కూడా లేదు ఒకవేళ ప్రస్తుతం టైం లో రంగస్థలం గనుక రిలీజ్ అయి ఉంటే కచ్చితంగా రామ్ చరణ్ కి అవార్డు వచ్చి ఉండేదేమో.. అదే ఉద్దేశాన్ని ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ కూడా ఇప్పుడు చెప్పుకొచ్చారు .మొత్తానికి అవార్డు రాకపోవడం పై అసహనం వ్యక్తం చేసినా…తమ పనికి ప్రేక్షకులు మెచ్చుకున్నారు అని చెప్పుకొచ్చారు రామకృష్ణ. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×