Akhanda 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. సింహ సినిమాతో మొదలైన ఈ కాంబినేషన్ మొన్న వచ్చిన అఖండ వరకు అద్భుతమైన సక్సెస్ లు సాధించింది. ఈ కాంబినేషన్స్ లో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇక ప్రస్తుతం వీరి కాంబినేషన్లో అఖండ 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను డిసెంబర్ 5వ తారీఖున ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా అదే లెవెల్ లో చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు.
అఖండ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది కాబట్టి ముంబై ఆడియన్స్ కు ఈ సినిమాను మరింత చేరువు చేయడానికి వారణాసిలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా యోగి ఆదిత్యానంద ను తీసుకొచ్చే ప్లానింగ్ కూడా ఉంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సినిమాకి సంబంధించి మొదటి సింగిల్ సాంగ్ ముంబై వేదికగా విడుదల చేశారు. ఆ సాంగ్ కు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత వైజాగ్ లో కూడా దీనికి సంబంధించి ఈవెంట్ చేశారు. బెంగళూరులో కూడా ఈ సినిమా ఈవెంట్ చేశారు. త్వరలో హైదరాబాదులో ఈవెంట్ చేయనున్నారు.
ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. అలానే బ్రేక్ ఈవెంట్ కావాలన్నా కూడా మంచి కలెక్షన్స్ రావాల్సిందే. అఖండ సినిమా సక్సెస్ సాధించింది కాబట్టి ఈ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. అయితే బాలకృష్ణ మరోవైపు పొలిటీషియన్ కూడా కాబట్టి ఈ సినిమాకి రాజకీయ నాయకుల్ని గెస్ట్లుగా ఆహ్వానిస్తున్నారు.
హైదరాబాదులో జరగబోయే ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వారణాసి ఈవెంట్ కు యోగి ఆదిత్యనాథ్ ఇలా మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రిని తీసుకొస్తున్నారు.
Also Read: Prabhas : ప్రభాస్ దర్శకులు అందరూ ప్రామిస్ లు చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు