E-Paper
Advertisement

Kishkindapuri : బెల్లంకొండ అసలు తగ్గట్లేదు, మిరాయి తో పోటీకి సిద్ధం

Kishkindapuri : బెల్లంకొండ అసలు తగ్గట్లేదు, మిరాయి తో పోటీకి సిద్ధం
Advertisement

Kishkindapuri : కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కిష్కిందపురి. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.

మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఒక రోజు క్రితం ఈ సినిమా సెప్టెంబర్ 13న వస్తున్నట్లు మరొక పోస్టర్ అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో సినిమా 12న విడుదలబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

 

బెల్లంకొండ అసలు తగ్గట్లేదు 

ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల అవుతుంది అని అనౌన్స్ చేసినప్పుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరోజు వెనక్కి తగ్గాడు అని అందరూ ఊహించారు. అయితే సినిమా 13వ తారీకు రిలీజ్ చేద్దామా అని డిస్కషన్ జరుగుతుండగానే, సినిమాకు సంబంధించిన డిజిటల్ టీం సెప్టెంబర్ 13 విడుదల అని కిష్కిందపురి పోస్టర్ రెడీ చేసింది. అయితే సెప్టెంబర్ 12న ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

అయితే ఇదే డేట్ కి కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) దర్శకత్వంలో తేజ నటిస్తున్న మిరాయి(Mirai) సినిమా విడుదల కానుంది. ఇదే ప్రశ్న నిర్మాతకు ఎదురైంది. అదే డేట్ కు ఇప్పుడు వస్తున్నారు కదా సినిమా ఎఫెక్ట్ అవ్వదా అంటూ ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగారు. దీనికి సమాధానంగా నిర్మాత మాట్లాడుతూ నా సినిమా రిలీజ్ డేట్ నేను ముందు అనౌన్స్ చేసి పోస్టర్ వేశాను. ఆ డేట్ కి వేరే సినిమా వస్తే ఏ సినిమా ఎఫెక్ట్ అవుతుందో ఆ రోజే తెలుస్తుంది అంటూ నిర్మాత మాట్లాడాడు.

భారీ అంచనాలు 

ఇక మిరాయి ఈ సినిమా విషయానికొస్తే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పాలి. ట్రైలర్లో విజువల్స్ ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి. బిఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడ తేడా చూపించడానికి కూడా లేదు. పాన్ ఇండియా స్థాయిలో మరోసారి తేజ సక్సెస్ ఖాయం అయిపోయినట్లే అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మంచి బిజినెస్ జరిగింది. ఇక సినిమాకి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా అద్భుతమైన కలెక్షన్లు రావడం కూడా ఖాయం.

Also Read: Telugu audience : అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావాలి?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×