E-Paper
Advertisement

Dharmendra Health: ఐసీయూలో ధర్మేంద్ర.. బాబీ డియోల్, సన్నీ డియోల్ భావోద్వేగం.. వీడియో వైరల్

Dharmendra Health: ఐసీయూలో ధర్మేంద్ర.. బాబీ డియోల్, సన్నీ డియోల్ భావోద్వేగం.. వీడియో వైరల్
Advertisement

Bobby Deol Visits Actor Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రను ప్రముఖ నటుడు బాబీ డియోల్, సన్నీ డియోల్ ను పరామర్శించారు. ప్రస్తుతం ఇంటి వద్ద చికిత్స పొందుతున్న ఆయనను స్వయంగా వెళ్లి పరామర్శించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. కాగా బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

ఇంట్లోనే చికిత్స

Advertisement

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఐసీయూలో ఆయనకు చికిత్స అందించిన వైద్యులు రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేసి ఆయన ఇంటి వద్దే చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. విషమ పరిస్థితులోనే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం ఫ్యాన్స్, నెటిజన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది.

బాబీ, సన్నీ డియోల్ భావోద్వేగం

అయితే కుటుంబ సభ్యులు నిర్ణయం మేరకు ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు డాక్టర్ ప్రతిత్ సందానీ పీటీఐకి వెల్లడించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలను ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, తన సోదరుడు సన్నీ డియోలు ఇద్దరు కాసేపటి క్రితం ధర్మేంద్రను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Advertisement

Also Read: SS Rajamouli: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ, ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్: రాజమౌళి

బెడ్ పై నిర్జీవ పరిస్థితుల్లో ధర్మేంద్ర

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బాబీ డియోల్, సన్నీ డియోల్ భావోద్వేగానికి లోనయ్యారు. బెడ్ పై నిర్జీవ స్థితిలో ఉన్న ఆయనను చూసి వారిద్దరు కన్నీరు పెట్టుకున్నారు. ధర్మేంద్ర ఆరోగ్యంపై ఆయన భార్య, బంధువులు ఏడుస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని బాబీ డియోల్, సన్నీ డియోలు ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్, ఫ్యాన్స్ స్పందిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భర్త మరణవార్తలపై హేమమాలిని ఫైర్

కాగా బాబీ, సన్నీ డియోల్ లు ధర్మేంద్రకు దగ్గర బంధువులు అని విషయం తెలిసిందే. ఆయన వరుసగా వారికి చిన్నాన్న అవుతారని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. వారి మధ్య మంచి అనుబంధం ఉందని, సినిమాల్లోనూ ఆయన కలిసి నటించారు. బాబీ, సన్నీలకు ధర్మేంద్రతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై చిందిస్తూ వారు కన్నీరు పెట్టుకున్నారు. కాగా కాగా ధర్మేంద్ర ఆరోగ్యంపై సోషల్ మీడియలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

ఆయన మరణించారంటూ పలు బాలీవుడ్ మీడియా వాళ్లు కథనాలు వెలువరించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు ఆయన కుమార్తె ఈషా డియోల్ తీవ్రంగా ఖండించారు. అలాగే ఆయన సతీమణి హేమ మాలిని సైతం ఈ తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం క్షమించరాని చర్య. ఇది చాలా బాధ్యతారాహిత్యం. దయచేసి కుటుంబ గోప్యతను గౌరవించండి” అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×