E-Paper
Advertisement

డీప్ ఫేక్ కి బాంబే హైకోర్టు బ్రేక్.. సొట్టబుగ్గల సుందరికి బిగ్ రిలీఫ్!

డీప్ ఫేక్ కి బాంబే హైకోర్టు బ్రేక్.. సొట్టబుగ్గల సుందరికి బిగ్ రిలీఫ్!
Advertisement

Deepfake Content: ”కాదెవరూ డీప్ ఫేక్ కి అనర్హం” అన్నట్టుగా బాలీవుడ్ తారల నుండి కోలీవుడ్ భామల వరకు అంతా దీని బాధితులే. అసలు వాటిల్లో ఉన్నది తామేనా అన్నంత బ్రమపడేలా డీప్ ఫేక్ మాయాజాలంతో బూతు బొమ్మలని మార్ఫింగ్ చేస్తూ తారల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు. అయితే తాజాగా ఇదే ‘డీప్‌ఫేక్’ మాయాజాలంపై మరోసారి కొరడా జులిపించింది బాంబే హైకోర్టు.

బాంబే హైకోర్టు మెట్లెక్కిన ప్రీతి జింటా

Advertisement

నాకు తెలీకుండా నా ఫోటోని , గొంతుని మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా బూతు బొమ్మల్ని వదిలారని, దయచేసి వాటిని తొలగించేలా ఆర్డర్ ఇవ్వాలంటూ గూగుల్, మెటా వంటి సోషల్ మీడియా వారిని ప్రతివాదులుగా చేరుస్తూ గత కొన్ని రోజుల కిందట సొట్టబుగ్గల బ్యూటీ ప్రీతి జింటా బాంబే హైకోర్టు మెట్లెక్కిన సంగతి తెల్సిందే.ఇక ఇదే కేసులో కోర్ట్ తీర్పునిస్తూ నకిలీ ఫోటోలు, అశ్లీల వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలంటూ గూగుల్, మెటా వంటి సోషల్ మీడియా దిగ్గజాలను కోర్టు ఆదేశించింది.అంతేకాదు..టెక్నాలజీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో సెలబ్రిటీల రెస్పెక్ట్ ని కాపడలేకపోతే అది మన సొసైటీకే డేంజర్ అంటూ హెచ్చరించింది.

also read:ప్రభాస్ 200 కోట్ల కోకాపేట ప్యాలెస్.. ఇల్లు కట్టేది పెళ్లి కోసమేనా?

Advertisement

విచ్చలవిడిగా పెరిగిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఇక ఇదే తీర్పులో తారల పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు), పబ్లిసిటీ రైట్స్ అనేవి కేవలం బిజినెస్ పరంగా చేసే ప్రకటనలకే పరిమితం కాదని, అవి ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తాయని కుండబద్దలు కొట్టింది కోర్ట్.ప్రీతి జింటా ఒక్కరే కాదు గతంలో కత్రినా కైఫ్,రష్మిక మందన్న,ఆలియా భట్ వంటి తారలు చాలా మంది ఈ డీప్‌ఫేక్ బాధితులే. విచ్చలవిడిగా పెరిగిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తారల బూతు చిత్రాలని, వీడియోలని కొంతమంది అదే పనిగా చానెల్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం తెలిసిందే.

బాలీవుడ్‌లో ఒక సెన్సేషన్

ఇక ప్రీతి జింటా విషయానికి వస్తే “దిల్ సే” సినిమాతో బాలీవుడ్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సొట్టబుగ్గల భామ”కల్ హో నా హో”, “వీర్-జారా” వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నసంగతి తెల్సిందే.ఇక IPL పంజాబ్ కింగ్స్ సహ-యజమానిగా స్టేడియంలో ఎలాంటి రచ్చ చేస్తుందో చెప్పక్కర్లేదు.చూడాలి మరి ఇలాంటి పనికి మాలిన పనులకి అడ్డు కట్ట వేయాల్సిందే అంటూ కోర్టు తీర్పునిచ్చిన ఈ సమయంలో గూగుల్, మరియూ ఇతర ఫ్లాట్ ఫామ్స్ ఏమేరకి అడ్డుకుంటాయో !

also read:ఖాకీల మధ్య ‘జాతిరత్నం’ రచ్చ.. నవీన్ పోలిశెట్టికి డీజీపీ అదిరిపోయే కౌంటర్!

Related News

కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్…26 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లెజెండ్ ఎంట్రీ !

77 వేల క్యాప్ నుండి రూ.7 కోట్ల క్యారవాన్ వరకు…హీరోల రాయల్ లైఫ్ స్టైల్ చూశారా?

మెగా 158 కోసం చిరు హైరిస్క్.. నడవలేని స్థితిలో!

ప్రభాస్ 200 కోట్ల కోకాపేట ప్యాలెస్.. ఇల్లు కట్టేది పెళ్లి కోసమేనా?

ఖాకీల మధ్య ‘జాతిరత్నం’ రచ్చ.. నవీన్ పోలిశెట్టికి డీజీపీ అదిరిపోయే కౌంటర్!

మరోసారి అడ్డంగా బుక్ అయిన టాలీవుడ్ కపుల్..

అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాయణం.. కానీ పెళ్లయ్యాక నరకం !

Big Stories

Advertisement
×