Boyapati Sreenu: ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే వివి వినాయక్, ఎస్.ఎస్. రాజమౌళి పేర్లు వినిపించేవి. ఆ తర్వాత కాలంలో వినాయక్ కామెడీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి ఈగ వంటి కాన్సెప్ట్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే టైంలో మాస్ కమర్షియల్ సినిమాలకు ఫెయిర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు బోయపాటి శ్రీను.
భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఇంటర్వ్యూ ఇచ్చాడు బోయపాటి శ్రీను. రవితేజ నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కూడా బోయపాటి శ్రీను బెస్ట్ వర్క్ లా చాలామందికి ఆ సినిమా అనిపిస్తుంది. బోయపాటి ఎన్ని సినిమాలు చేసినా కూడా బాలకృష్ణతో సినిమా చేయడం అనేది కొంతమేరకు ప్రత్యేకం. ఇప్పటివరకు వారి కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి అవన్నీ కూడా బ్లాక్ బస్టర్లు.
అయితే బోయపాటి శ్రీనుకి మీ సినిమాల్లో కొత్తగా అనిపించేది ఏదైనా ఉందా అనే ప్రశ్న ఎదురైంది. అఖండ 2 సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో మాట్లాడుతూ నాకు అలా ప్రతి సినిమాలో కూడా అనిపిస్తూ ఉంటుంది. నేను భద్ర సినిమాకి సంబంధించి 16 దాటి చెట్లు మధ్యలో నుంచి ఎనిమిది సుమోలు ఎగిరేలా చేశాను.
నా మొదటి సినిమాకే అలా చేశాను. అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎవరూ కూడా అలాంటిది చేయలేదు నేనే ఫస్ట్ టైం చేశాను అంటూ బోయపాటి శ్రీను చెప్పారు. నా ప్రతి సినిమాలో కూడా అలాంటివి కొత్త కొత్తగా డిజైన్ చేస్తుంటాను అని బోయపాటి శ్రీను తెలిపారు.
అయితే అవన్నీ చెప్పిన తర్వాత బాలకృష్ణ కోసం చాలా ప్రత్యేకంగా తాను డిజైన్ చేస్తాను అని బోయపాటి శ్రీను చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం రాబోయే అఖండ 2 సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ తరుణంలో చిత్ర యూనిట్ విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది కాబట్టి. ముంబై బెంగళూరు వైజాగ్ వంటి వివిధ ప్రాంతాల్లో సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగబోతుంది.
Also Read : Bigg Boss 9 Telugu : హౌస్ లో దొంగతనం, మధ్యలో దూరకంటూ దివ్యతో గొడవ పడిన భరణి