Akhanda 2 : చాలామంది దర్శకులకు తమ కొడుకుల్ని నటుడుగా చూడాలి అనే కోరిక ఉండడం సహజంగా జరుగుతుంది. ఇప్పటికే గోపీచంద్ మలినేని కొడుకు గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కనిపించాడు. ఇక తాజాగా అఖండ 2 సినిమాలో బోయపాటి శ్రీను కుమారుడు కనిపించనున్నాడు. ఈ ఈవెంట్ లో బోయపాటి శ్రీను కుమారుడు వర్షిత్ కూడా ఆసక్తికర స్పీచ్ ఇచ్చాడు.
ఆ వ్యక్తిని తన అబ్బాయి అని ముందుగానే పరిచయం చేయకుండా ఒక ఆర్టిస్టును మీకు పరిచయం చేస్తాను అని మైక్ ఇచ్చి మాట్లాడించారు బోయపాటి శ్రీను. వర్షిత్ మాట్లాడుతూ తన మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు.
నా పేరు బోయపాటి వర్షిత్, నేను ఈ సినిమాలో నటించాను. బాలకృష్ణ అన్నతో నటించటం నాకు చాలా ఆనందంగా ఉంది. బోయపాటి శ్రీను గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బోయపాటి సరికి వెరీ థాంక్యూ. జై బాలయ్య అంటూ తన స్పీచ్ ఇచ్చాడు. అయితే చివర్లో అంతేనా నాన్న ఇంకేమైనా చెప్పాలా అంటూ బోయపాటి శ్రీను అని అడిగాడు వర్షిత్. వర్షిత్ మాటలను బట్టి చూస్తే బోయపాటి శ్రీను మాట్లాడించినట్లు అర్థమైపోతుంది.
అయితే అంత స్పీచ్ అయిపోయిన తర్వాత బోయపాటి శ్రీను మాట్లాడుతూ నన్ను అడుగుతున్న వేంటిరా. మొత్తానికి బోయపాటి శ్రీను అలా అన్నా కూడా అతని ట్రైనింగ్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక అఖండ సినిమాలో ఎంతటి కీలకపాత్రను తన కుమారుడి కోసం డిజైన్ చేశాడో చూడాలి. అయితే బోయపాటి శ్రీనుకి మొత్తం ఇద్దరు కుమారులు వారిలో ఈ రెండో వాడు వర్షిత్.
ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. రీసెంట్ లో బాలకృష్ణ చేస్తున్న అన్ని సినిమాలకు తమన్ మాత్రమే సంగీతం ఇస్తున్నారు. ఒక మామూలు సినిమాని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడం తమన్ మ్యూజిక్ ఉన్న ప్లస్.
Also Read: Akhanda 2 Event : నాకు చాలా వర్క్స్ ఉన్నాయి కానీ ఒకరే భార్య, పవన్ కళ్యాణ్ కు బాలయ్య కౌంటర్?