E-Paper
Advertisement

Chiranjeevi: డిప్యూటీ సీఎం కుమారుడి పెళ్లిలో మెగాస్టార్.. ఫొటోలు వైరల్!

Chiranjeevi: డిప్యూటీ సీఎం కుమారుడి పెళ్లిలో మెగాస్టార్.. ఫొటోలు వైరల్!
Advertisement

Chiranjeevi: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu) కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక (Surya Vikramaditya Weds Sakshi) మార్చి 5, గురువారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. పెళ్లి పీటలపై ఉన్న నూతన వధూవరులను చిరంజీవి ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ రాకతో వివాహ వేదిక వద్ద కోలాహలం నెలకొంది. ఈ వేడుకలో చిరంజీవి నూతన దంపతులతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో నిరాడంబరంగా, చిరునవ్వుతో కనిపిస్తున్న మెగాస్టార్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫ్యామిలీ చిరంజీవికి ఎంతో సన్నిహితులనే విషయం తెలియంది కాదు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి సన్మానించారు.

Also Read- Tollywood Actor:పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో.. ఎంగేజ్మెంట్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు వైరల్

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ఈ పెళ్లి వేడుకలో చాలా సింపుల్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఆయన ఫొటోలను వైరల్ చేస్తున్నారు. మొత్తంగా అయితే.. రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తన కుమారుడి వివాహానికి విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవికి, ఇతర ప్రముఖులకు మల్లు భట్టి విక్రమార్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ రాక మా కుటుంబంలో ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపింది’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మెగా సందడితో భట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లి వేడుకలు మరింత కలర్‌ఫుల్‌గా మారాయి. అంతకు ముందు తన కుమారుడి పెళ్లికి రావాలంటూ స్వయంగా మల్లు భట్టి విక్రమార్క.. సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Also Read- Mrithyunjay: కట్టిపడేసింది.. శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’పై నేచురల్ స్టార్ నాని రివ్యూ!

ఖర్గేకు కృతజ్ఞతలు

Advertisement

ఇప్పుడు కూడా, తన కుమారుడి పెళ్లికి వచ్చిన పెద్దలందరి ఫొటోలను షేర్ చేస్తూ.. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ‘‘నా కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదించిన ఏఐసీసీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ రాక మా కుటుంబంలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది’’ అంటూ మల్లు భట్టి విక్రమార్క షేర్ చేసిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో నూతన జంట సూర్య విక్రమాదిత్య, సాక్షి కలిసి మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకుంటున్నారు.

Also Read- Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ఖర్చు ఎంతో తెలుసా..పెళ్ళి ఖర్చు మొత్తం తనదేనా?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×