Committee Kurrollu 2: తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో మరోసారి పల్స్ రేట్ పెంచేస్తూ, ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్ ఒక బిగ్ సర్ప్రైజ్తో మన ముందుకు రాబోతుంది. గత ఏడాది (2024) ఆగస్టు 9న చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద అయిన ఈ సినిమా… ఇప్పుడు సీక్వెల్తో రిపీట్ కాంబోని మరో సారి సిద్ధం చేస్తోంది. నిహారిక కొణిదెల నిర్మాణంలో, కొత్త దర్శకుడు యదు వంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం విలేజ్ బ్యాక్డ్రాప్లో పొలిటికల్ థ్రిల్, ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తం 11 మంది కొత్త నటీ నటులకు ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ.
కేవలం 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం 24.5 కోట్లు వసూళ్లు చేసి.. ప్రస్తుతం OTTలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అది కేవలం బాక్సాఫీస్ విజయం మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కొత్త టాలెంట్కు ఒక మైలురాయి కూడా. ఇప్పుడు, ఆ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. యదు వంశీ డైరెక్టర్గా, నిహారికా ప్రొడ్యూసర్గా మరోసారి కలిసి ఆడియన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కథను యదు వంశీ ఇప్పటికే రెడీ చేశారట. ఇంతకముందు సినిమాలోని ఎమోషనల్ డెప్త్ని మరింత ఎలివేట్ చేస్తూ, ప్రేక్షకులను మళ్లీ వాళ్ల చిన్నప్పటి గ్రామీణ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తారని అంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ 2026 స్టార్టింగ్లో సెట్స్ మీదకు వెళ్తుందని, వచ్చే ఏడాది చివరిలో (డిసెంబర్ 2026) స్క్రీన్స్ మీద రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ సీక్వెల్తో మళ్లీ కొత్త ఫ్రెష్ ఫేసెస్ ఎంట్రీ అవుతాయా? లేదా అదే క్యాస్ట్లో కొందరు ఉంటారా? అనేది తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకేవేళ ఇదే నిజమైతే మాత్రం.. ఒకటి మాత్రం కన్ఫర్మ్.. ఈ కాంబో మళ్లీ స్క్రీన్పై మ్యాజిక్ చేయడం పక్కా అంటున్నారు మూవీ లవర్స్. కాగా విడాకులు తర్వాత ఈ మెగా డాటర్ ప్రొఫెషనల్ లైఫ్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. సిద్దు జొన్నలగడ్డతో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంది. రెండేళ్లు వైవాహిక జీవితంతో బిజీగా ఉంది.
Alos Read: SSMB29: ఫస్ట్లుక్, టైటిల్ లాంచ్కి రంగం సిద్దం.. రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్!
అదే టైంలో భర్తతో మనస్పర్థలు కారణంగా నిహారిక సిద్దు జొన్నలగడ్డకు కొన్ని రోజులు పాటు దూరంగా ఉంది. ఆ తర్వాత సడెన్ విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చింది. డైవోర్స్ తర్వాత కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె ఆ వెంటనే పింక్ ఎలిఫెంట పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ స్థాపించింది. దీనిపై మొదటి కమిటీ కుర్రాళ్లు మూవీ నిర్మించింది. ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ నిర్మించింది. ఇప్పుడు తన బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2కి సిద్దమైంది. మానస శర్మ దర్శకత్వంలో ఓ ఫాంటసి, కామెడీ డ్రామాను నిర్మించబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో సంగీత్ శోభన్, నయన్ సారికా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం త్వరలోనే సెట్స్పై రానుందని సమాచారం.